అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. ఆయన అధిక సుంకాలు విధించడం వల్ల అనేక దేశాల మధ్య ట్రేడ్ వార్ ప్రారంభమైంది. (Trump) ప్రశాంతంగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు వాణిజ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఈ రంగాలకు పెద్ద దెబ్బే!
ఈ సుంకాల దెబ్బకు ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చింది. భారతదేశం కూడా ఈ ప్రభావాన్ని తప్పించుకోలేకపోతుంది. నిపుణుల ప్రకారం కొన్ని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రమాదంలో 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు
అమెరికా ఎగుమతులపై అధిక పన్నులు విధించడం వల్ల దేశంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎక్కువ ప్రభావం పడే రంగాలు వ్యవసాయం, ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ సుంకాల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త నియామకాలను బ్రేక్
వస్త్ర రంగంలో మాత్రమే లక్ష మంది ఉద్యోగులు రోడ్డుమీదకు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సూరత్, ముంబై వంటి కేంద్రాల్లో రత్నాలు, ఆభరణాల యూనిట్లు కూడా డిమాండ్ తగ్గిపోవడంతో నష్టాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు కొత్త నియామకాలను ఆపేశాయి. అయితే, బ్రిటన్ మరియు ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) జరిగితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Read also: