📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు

Author Icon By Vanipushpa
Updated: June 17, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లో దాడుల వేళ పరిస్థితులు (Iran Israel Conflict) అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి జనాల జీవనం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌(Iran) కోమ్ ప్రాంతంలోని 55 ఏళ్ల అఫ్గాన్ వ్యాపారవేత్త హుస్సేన్ (Hussen)తన స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇరాన్ గగనతలం పూర్తిగా క్లోజ్ చేశారు. విమానాలు, మార్కెట్లు, అన్నీ మూతపడ్డాయి. ఈ క్రమంలో ట్యాక్సీ కూడా దొరకడం కష్టంగా మారిందని వాపోయాడు. ఘర్షణ తీవ్రమవుతుండటంతో ఏ డ్రైవర్ కూడా అతన్ని సరిహద్దు వరకు తీసుకెళ్లలేదు. దీంతో ఆదివారం (జూన్ 15) దాడుల తర్వాత అతను టెహ్రాన్ పారిపోయాడు. ప్రస్తుతం అతను ఒక చిన్న హోటల్ బేస్‌మెంట్‌లో బతుకుతున్నానని ఓ మీడియాకు చెప్పాడు.

Israel: ఇరాన్ లో స్తంభించిన రవాణా, ప్రజల ఇబ్బందులు

కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంస మయ్యాయి
ఇజ్రాయెల్ శుక్రవారం (జూన్ 13) ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో సీనియర్ సైనిక అధికారులు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంస మయ్యాయి. లకోమ్ నుంచి 18 మైళ్ల దూరంలో ఉన్న న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్ సౌకర్యం కూడా లక్ష్యంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు. ఇరాన్‌ను అణు బలంతో భారత్, ఇజ్రాయెల్ మించిన స్థాయికి తీసుకురావాలనే దురుద్దేశంతో పావులుగా వాడుతున్న శక్తులను ఎదుర్కోవడం తప్ప
ఇజ్రాయెల్‌కి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

గగనతలం మూసివేత
ఈ సంఘర్షణ కారణంగా (Iran Israel Conflict) మధ్య ప్రాచ్యంలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. డజన్ల కొద్ది విమానాశ్రాయాలు విమాన సర్వీసులను తీవ్రంగా తగ్గించాయి. దీంతో వేలాది మంది ప్రయాణీకులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో 50,000 మంది ప్రయాణీకులు విదేశాల్లో చిక్కుకుపోయారు. మరి కొందరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలని చూసినా కూడా సాధ్యం కావడం లేదు. దేశంలోని మూడు విమానయాన సంస్థల జెట్‌లు సైప్రస్‌లోని లార్నాకాకు తరలించబడ్డాయి.
హాస్టళ్లను విడిచి బయటకు రాని మెడికల్ విద్యార్థులు
50 ఏళ్ల జివికా బెర్గ్ న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్ సమయంలో పైలట్ నుంచి ఊహించని సందేశం వచ్చింది. క్షమించండి, మనం లార్నకాకు మళ్లించబడ్డామని పేర్కొన్నారు. బెర్గ్, బర్లిన్ నుంచి వచ్చిన మరో ఇజ్రాయెల్ విమానాన్ని సైప్రస్‌లోని లార్నకా విమానాశ్రాయంలో లాండ్ చేశారు. ఇప్పుడు అతను లార్నకాలోని ఒక హోటల్‌లో ఉంటూ జీవిస్తున్నారు. ఇరాన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులలో అర్సలాన్ అహ్మద్ ఒకరు. మెడికల్ విద్యార్థులతో సహా ఇతర విద్యార్థులు తమ హాస్టళ్లను విడిచి బయటకు రావడం లేదు.

Read Also: Gaza : ఇజ్రాయెల్ దాడి – 45 మంది పాలస్తీనియన్లు మృతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu halted in Iran Latest News in Telugu Paper Telugu News people's difficulties Telugu News online Telugu News Paper Telugu News Today Transportation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.