📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల

Author Icon By Vanipushpa
Updated: March 12, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికీ బలూచ్ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉంది. ఇప్పటివరకు 150 మందికి పైగా బందీలను పాకిస్థాన్ సైన్యం విడిపించగా.. 100 మందికి పైగా బందీలు ఇప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులోనే ఉన్నారు. ఇంతలో మొత్తం రైలు దాడి కాలక్రమాన్ని తెలియజేసే వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. బీఎల్ఏ(బలూచ్ లిబరేషన్ ఆర్మీ) విడుదల చేసి ఈ వీడియోలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ కదులుతున్నట్లు కనిపించింది. ఇంతలోనే రైలును లక్ష్యంగా చేసుకుని ముందుగా పేలుడు జరుగుతుంది.

వీడియోలో బందీలను బయటకు తీసుకుని వస్తున్న దృశ్యాలు

ఈ పేలుడు తర్వాత రైలు ఆగుతుంది. ఈ వీడియోలో బలూచ్ తిరుగుబాటుదారులు కూడా కనిపిస్తారు. కొండలపై కూర్చుని రైలు కోసం వేచి చూస్తూ ఉన్నారు. రైలు ప్రయాణికులను బందీలుగా తీసుకుని బయటకు తీసుకువస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వారు కొండల మధ్య తుపాకీ గురిపెట్టి కూర్చుని కనిపించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా దాడి చేసింది? మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ లోని క్వెట్టా నుంచి జాఫర్ ఎక్స్‌ప్రెస్ పెషావర్ కు బయలుదేరింది. ఈ రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు సిబ్బికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఈ దాడి బోలాన్ లోని మష్పాక్ టన్నెల్ లో జరిగింది. రైలు వెళ్తున్న ప్రదేశం ఒక కొండ ప్రాంతం. అక్కడ 17 సొరంగాలు ఉన్నాయి. దీని కారణంగా రైలు వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ మష్పాక్ లోని సొరంగం-8ని పేల్చివేసింది. దీని కారణంగా రైలు పట్టాలు తప్పి హైజాక్ చేయబడింది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ప్రణాళికతో ..

ఈ దాడిని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ప్రణాళికతో నిర్వహించింది. బలూచ్ తిరుగుబాటుదారులు అప్పటికే వేచి ఉన్నారు. ఈ దాడి కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన అత్యంత ప్రాణాంతక యోధులైన మజీద్ బ్రిగేడ్, ఫతేలను సిద్ధం చేసింది. పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. మష్పాక్ టన్నెల్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ సొరంగం క్వెట్టా నుంటి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సొరంగం ఉన్న ప్రాంతం చాలా కఠినమైన కొండ ప్రాంతం. హైజాక్ చేయబడిన రైలు ప్రస్తుతం బోలాన్ పాస్ వద్ద నిలిచి ఉంది. ఈ ప్రాంతమంతా కొండలు, సొరంగాలతో చుట్టుముట్టబడి ఉండటం వల్ల మొబైల్ నెట్ వర్క్ లేదు. దీని కారణంగా రెస్క్యూ ఆపరేషన్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

#telugu News Ap News in Telugu Baloch Army releases video Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Train hijack incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.