📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

BCCI: భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండవు: బీసీసీఐ

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు తీసుకుని పాకిస్థాన్ కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది.అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఉండబోవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారత్ పాక్ మధ్య పోరు చూడాలనే ఫ్యాన్స్ కు కొంత నిరాశ అనే చెప్పొచ్చు.

ఉగ్రదాడి

భారత్- పాకిస్థాన్ మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటినుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతూ వచ్చాయి. అయితే తాజా సంఘటనలతో ఇక భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.భారత్- పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. అంతకంటే నాలుగేళ్ల ముందే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్ కు అడ్డుచెప్పలేదు. ఇక రెండు నెలల క్రితం జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. కానీ, ఆ టోర్నీకి భారత్ వెళ్ల లేదు.దుబాయ్ లో మ్యాచ్ లు ఆడి అక్కడే టైటిల్ కొట్టింది.

భద్రత

ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో, భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఈ ఉదంతం ప్రభావం ఎలా ఉంటుందో, రెండు బోర్డులు దీన్ని ఎలా సమర్థంగా ఎదుర్కొంటాయో అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. దేశ భద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తూనే, క్రీడా సంబంధాల్లో కూడా కఠినమైన వైఖరిని పాటించాల్సిన అవసరం ఉందని రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు బలంగా సూచిస్తున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించరాదన్న నిర్ణయం పై బీసీసీఐ స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Read Also: Telangana : తెలంగాణకు మరో స్వర్ణ పతకం: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కప్

#BCCI #CricketPolitics #IndiaVsPakistan #NoBilateralSeries #PahalgamAttack Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.