📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trade: అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. ఇక అమెరికా-చైనా మధ్య జరిగిన సుంకాలు, ప్రతీకార సుంకాలు తారస్థాయికి చేరుకోవడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రతీకార సుంకాలు విధిస్తున్న అమెరికాకే భారత్ బిగ్ షాక్ ఇచ్చింది.పాకిస్తాన్తో యుద్ధంలోనే కాదు, అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదని మరో మారు తేల్చి చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.కొన్ని అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ) డబ్ల్యూటీఓకు భారత్ తాజాగా తెలియజేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన అమెరికా ఉత్పత్తులకు అందిస్తున్న రాయితీలను నిలిపివేయడంతోపాటు దిగుమతి సుంకాలను పెంచాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది.

అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదు : మోదీ

ఉద్రిక్తత

అమెరికా విధించిన టారిఫ్‌ల కారణంగా సుమారు 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టారిఫ్‌ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని గతంలోనే భారత్ తప్పుబట్టింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించారు. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ రంగంపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని డబ్ల్యూటీవో(WTO) వద్ద భారత్ గట్టిగా లేవనెత్తడంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.భారత్, అమెరికా ఒక కొత్త వాణిజ్య ఒప్పందానికి దగ్గరికి వచ్చిన తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ అనేక రాయితీలను అందించినట్లు తెలుస్తోంది. వాటి భవిష్యత్ ఏంటి అనేది ముందు ముందు బయటపడనుంది.

Read Also : Sports: కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడు: సచిన్

#IndiaUSRelations #ModiGovernment #narendramodi #TradeWar Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.