हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత

Shobha Rani
RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) (RCB) జట్టు ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరిన వేళ, విజయోత్సవ సభ విషాదానికి దారి తీసింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాటకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారనే వదంతులు వ్యాపించడం, స్టేడియం గేట్లను మూసివేయడం, ఊహించని రీతిలో జనం పోటెత్తడం వంటి అంశాలు కారణమయ్యాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం వాస్తవ సామర్థ్యం 35 వేల మంది మాత్రమే కాగా, బుధవారం సాయంత్రానికి దాదాపు మూడు లక్షల మంది అభిమానులు స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు.
ఫ్యాన్స్ ఆరోపణలు – నిర్లక్ష్యమే కారణమా?
స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు, 13 గేట్లు ఉన్నాయి. వీటిలో 9, 10 నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుల కోసం కేటాయించారు. మిగిలిన గేట్లలో 5, 6, 7 నంబర్ గేట్ల ద్వారా అభిమానులను లోపలికి అనుమతించారు. ముఖ్యంగా, 7వ నంబర్ గేటు నుంచి స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్సీబీ (RCB) జట్టు ఇదే మార్గం గుండా మైదానంలోకి వస్తుందన్న ఉద్దేశంతో అభిమానులు అత్యధిక సంఖ్యలో ఈ గేటు వద్దకే చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి ప్రవేశం కల్పించారు. అయితే, పాస్‌లు లేనివారు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో, 7వ నంబర్ గేటు వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో, టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని, ఎక్కువ నష్టం ఈ గేటు వద్దే సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత
RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత

అధికార ప్రకటనల గందరగోళం
స్టేడియం వద్ద రద్దీని అదుపు చేసేందుకు సుమారు 5 వేల మంది పోలీసులను మోహరించినప్పటికీ, ఊహించిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా అభిమానులు తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. స్టేడియం గేట్లు కూడా ఇరుకుగా ఉండటం వల్ల అభిమానులు లోపలికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. “స్టేడియం గేట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. జనం కిక్కిరిసిపోవడంతో కొన్ని గేట్లు విరిగిపోయాయి. అంచనాలకు మించిన రద్దీ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నాం” అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అయితే, తమ వద్ద పాస్‌లు ఉన్నప్పటికీ, గేట్లు మూసివేసి లోపలికి అనుమతించలేదని కొందరు అభిమానులు ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ (RCB) జట్టు విజయోత్సవ పరేడ్ నిర్వహిస్తుందని ఆ జట్టు యాజమాన్యం తొలుత ఉదయం ప్రకటించింది. అయితే, అభిమానుల భారీ రాకను ముందే ఊహించిన పోలీసులు, శాంతిభద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతి నిరాకరించారు. ఆర్సీబీ (RCB) జట్టు పరేడ్ ఉండదని, కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11:56 గంటలకు స్పష్టం చేశారు.
ప్రభుత్వ స్పందన – దర్యాప్తు ఆదేశం
కానీ, మధ్యాహ్నం ఆర్సీబీ (RCB) యాజమాన్యం మరోసారి ప్రకటన చేస్తూ, పరేడ్ యథావిధిగా జరుగుతుందని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పరేడ్ జరుగుతుందో లేదో తెలియని అయోమయంతో, చాలామంది నేరుగా మైదానంలోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో, టికెట్లు లేని కొందరు గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని, దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఒక్కో సంఘటన వెనుక వ్యవస్థాపక లోపాలు, దృష్టి త‌ప్పిదాలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో చిన్నస్వామి స్టేడియం ఘటన మరోసారి స్పష్టంగా తెలిపింది. ఆట ఉత్సాహంగా ఉండాలి కానీ వ్యవస్థాపితంగా, భద్రతగా ఉండాలని ఇప్పుడు ప్రతి ఫ్రాంచైజీ, ప్రభుత్వ యంత్రాంగం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.

Read Also: RCB: ఆర్సీబీ ఘటనపై హైకోర్టులో కేసు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870