Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!

Read Time:  1 min
Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!
FONT SIZE
GET APP

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌(Kedarnath) లో శనివారం ఎయిమ్స్ రిషికేశ్ హెలి అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన హెలికాప్టర్ క్రాస్‌ ల్యాండ్‌ అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. హెలికాప్టర్‌ వెనుక భాగం కూలిపోయింది. ఈ హెలికాప్టర్‌ AIIMS రిషికేశ్ హెలి (Aiims Rishikesh’s Heli Ambu) అంబులెన్స్ సర్వీస్‌కు చెందినది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు – పైలట్ (కెప్టెన్), ఒక వైద్యుడు, వైద్య సహాయకుడు సురక్షితంగా బయటపడ్డారు. ఎత్తైన ప్రాంతానికి విమానంలో వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అక్కడ హెలికాప్టర్ వైద్య అత్యవసర సేవలో పాల్గొంటున్నట్లు సమాచారం.

Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!
Kedarnath: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్‌.. తప్పిన ప్రాణాపాయం!

సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం
హెలికాప్టర్ వెనుక భాగాన్ని ప్రభావితం చేసే సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ జరిగింది. గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే (Vinay shankar pandey) ఈ సంఘటనను ధృవీకరించారు. పైలట్, ఆన్‌బోర్డ్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటనపై ఎయిమ్స్ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సందీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కేదార్‌నాథ్‌లో ఒక రోగి కోసం హెలి-అంబులెన్స్ వెళ్లిందని. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందని, ఈ ప్రక్రియలో హెలికాప్టర్ దెబ్బతిందని తెలిపారు. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతిన్నట్లు చూపించే వీడియో కూడా బయటకు వచ్చింది.
గంగోత్రి సమీపంలో ఘోర ప్రమాదం
ఈ నెల ప్రారంభంలో అంటే మే 8న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఏడు సీట్ల హెలికాప్టర్ గంగోత్రి సమీపంలో కూలిపోయింది. ఈ సంఘటనను గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించారు. సంఘటన జరిగిన వెంటనే, స్థానిక నివాసితులు మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అత్యవసర రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.వైద్య అత్యవసర సేవల కోసం వెళ్లిన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్‌తో తప్పిన ప్రాణాపాయం మన వైమానిక రంగం లోపాలను ఎత్తిచూపుతోంది. అలాగే భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో, ముఖ్యంగా హెలి సేవల భద్రత పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

Read Also: Turkey: అజియో, మింత్రా – టర్కీ వస్త్ర బ్రాండ్లకు గుడ్‌బై

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.