Pakistan: అసలే భారత్ తో చేసిన యుద్ధంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. యుద్ధంతో చతికిపడ్డ పాకిస్తాన్ అందులో నుంచి బయటపడేందుకు ఓ భారీ రైల్వే ప్రాజెక్టు(Railway Project) చేపట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందంతో ప్రాజెక్టు నిర్మాణానికి పనులకు సిద్ధం అయ్యింది. అయితే అన్యూహంగా చైనా యూటర్న్ తీసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకుంది. చైనా తప్పుకోవడంతో నిధుల కోసం పాక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ను ఆశ్రయించింది. పాక్ లో కరాచీ నుంచి పెషావర్ వరకు ఉన్న మెయిన్ లైన్ 1 రైల్వే ప్రాజెక్ట్ కోసం చైనా భాగమైంది. భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 9.8 బిలియన్ డాలర్లు. ఈపాజెక్టు నిర్మాణం జరిగితే పాకిస్తాన్ లో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావించి చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు చైనా పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాక్ సందిగ్ధంలో పడింది.

పాక్ అమెరికాతో స్నేహమేనా
చైనా హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇందుకు కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే పాకిస్తాన్, చైనా మిత్ర దేశాలు. అయితే ఇటీవల పాకిస్తాన్ అమెరికాతో స్నేహం చేస్తోంది. ఆదేశంతో పలు ఒప్పందాలను కుదుర్చుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ అమెరికాకు దగ్గర కావడంతో ఇది చైనాకు నచ్చలేదు. ఈ కారణం వల్లనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు పాక్ అప్పులో ఉందని, ఇప్పుడ మళ్లీ సాయం చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి ఈ భారీ పాజెక్టు నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చైనా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ కు మళ్లీ కష్టాలు వచ్చాయి. రుణాల కోసం అన్వేషణ ప్రారంభించింది.
బ్యాంకు ఆశ్రయించిన పాక్
ఈ భారీ రైల్వే ప్రాజెక్టుకు నిధులు సమకూర్చమని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును (Development Bank)ఆశ్రయించింది. 1.72 లక్షల కోట్లు రుణం ఇవ్వాలని ఏడీబీని పాక్ కోరింది. ఈ రైల్వే ప్రాజెక్టు కరాచీ నుంచి పెషావర్ వరకు 1,800 కిలోమీటర్లుకి అప్డేట్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు పది సంవత్సరాల పాటు దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఏదిఏమైనా చైనా యూటర్న్ తీసుకోవడంతో పాక్ పరిస్థితి మరింతగా దిగజారింది.
చైనా ఏ ప్రాజెక్టుల నుండి వైదొలిగింది?
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద చేపట్టిన కొన్ని ప్రధాన రోడ్డు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నుండి చైనా వైదొలగినట్లు సమాచారం. వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కావని చైనా భావిస్తోంది.
ఈ నిర్ణయం పాకిస్థాన్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
చైనా ఈ ప్రాజెక్టుల నుండి వైదొలగడం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రవాహాన్ని నిలిపివేస్తుంది, మరియు దేశం యొక్క అప్పుల భారాన్ని మరింత పెంచుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :