📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: తహవ్వుర్‌ రాణా నిర్దోషిగా కాదు దోషినే: ప్రధాని మోదీ ట్వీట్

Author Icon By Vanipushpa
Updated: April 11, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో రాణా గురించి గతంలో ప్రధానంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. 2011లో ఈ కేసుకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని స్పష్టం చేసింది. కానీ, ఆ దాడులకు కారణమైన ఉగ్ర సంస్థకు మద్దుతు ఇచ్చినందుకు రాణాను దోషిగా తేల్చింది.

నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్
అయితే ఆ తీర్పుపై స్పందిస్తూ 2011 జూన్​ 10న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దౌత్య విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నాడు గుజరాత్ సీఎం హోదాలో మోదీ పోస్ట్​ చేశారు. ముంబయి ఉగ్రదాడిలో తహవ్వుర్‌ రాణాను నిర్దోషిగా యూఎస్‌ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే. ఇది విదేశాంగ విధానానికి భారీ ఎదురుదెబ్బ’ అని మోదీ పోస్ట్​ చేశారు.

18 రోజుల కస్టడీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రాణాను భారత్​కు అప్పగించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. అంతేకాకుండా అమెరికా న్యాయస్థానం కూడా రాణాను అప్పగించేందుకు అంగీకరించింది. ఇక గురువారమే భారత్​కు తీసుకొచ్చిన రాణాను కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్లీలోని పటియాలా హౌస్​ కోర్టుకు తరలించారు. 20 రోజులు కస్టడీకి కోరగా, 18 రోజుల కస్టడీకే ఎన్​ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చందర్‌జిత్‌సింగ్‌ అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఎన్​ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.

READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu he is guilty: PM Modi tweets Latest News in Telugu Paper Telugu News Tahawwur Rana is not innocent Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.