ముంబయి దాడుల నిందితుడు తహవ్వుర్రాణాను అమెరికా భారత్కు అప్పగించింది. ముంబయి దాడులకు బాధ్యుడైన తహవ్వుర్ రాణాను అమెరికా గురువారం అప్పగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. అప్పగింత ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు రాణా.. అమెరికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఎన్ఐఏ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాణాకు చట్టపరంగా ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో ఆయన అప్పగింత సాధ్యపడిందని తెలిపింది. తహవ్వూర్ రాణా 2013లో ఆయన స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై దాడులకు పాల్పడినందుకు, డెన్మార్క్లో దాడికి ప్రణాళిక వేసినందుకు అమెరికాలో ఆయన దోషిగా తేలారు. ఈ కేసుల్లో, తహవ్వూర్ హుస్సేన్ రాణాకు అమెరికా కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
రోజు ముంబయిలో ఏం జరిగింది?
భారీగా ఆయుధాలు ధరించి శిక్షణ పొందిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయిలోని అనేక ప్రదేశాలు, ప్రసిద్ధ భవనాలపై దాడులు చేశారు. ఈ దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. 160 మందికి పైగా మరణించారు. ముంబయి నగరం 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి, అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. దాడి చేసిన వ్యక్తులు ముంబయిలోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్ళు, ఒక ఆసుపత్రి, రైల్వే స్టేషన్లు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
మొదట్లో ఇంత పెద్ద దాడి జరిగుతుందని ఎవరూ ఊహించలేదు. 60మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో బీభత్సం
రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్లో బీభత్సం జరిగింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కూడా ఒకటి . ఆ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దుండగులు ఒక్కసారిగా విచక్షణారహితంగా తూటాలు పేల్చారు.
READ ALSO: Stock Market: 90 రోజుల బ్రేక్ తర్వాత ఊపందుకున్న దేశీయ స్టాక్ మార్కెట్