హర్మూజ్(Hormuz) జలసంధి విషయంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్లతో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పట్టు సాధించిన ఇరాన్, ఇకపై పాత పద్ధతులు సాగవని స్పష్టం చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత ఈ ప్రాంతంలో నౌకల రాకపోకల కోసం కొత్త నిబంధనలు, ఒప్పందాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హర్మూజ్ జలసంధిలో భద్రతను కాపాడటం తమ బాధ్యతని, అయితే ఇకపై అక్కడ ప్రయాణించే నౌకలు కొత్త ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్, అమెరికా కార్యకలాపాల వల్ల అభద్రతా భావం పెరిగిందని, అందుకే ప్రాంతీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు ఉండాలని ఇరాన్ వాదిస్తోంది. ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదని, దీర్ఘకాలికంగా ఈ జలమార్గంపై తమ సార్వభౌమాధికారాన్ని పెంచుకునే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Israel-Iran War: మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

నౌకలపై ఆంక్షలు – ఎవరికి అనుమతి?
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయలేదు కానీ, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్: ఈ రెండు దేశాలకు చెందిన లేదా వాటితో సంబంధం ఉన్న నౌకలను హర్మూజ్లోకి రానిచ్చేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. భారత్, చైనా వంటి మిత్రదేశాల నౌకలకు ఇరాన్ వెసులుబాటు కల్పించింది. భారత్తో ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా, మన చమురు ట్యాంకర్లకు సురక్షిత మార్గాన్ని ఇస్తామని ఇరాన్ రాయబారి ఇప్పటికే ప్రకటించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్తో జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటికే కొన్ని భారతీయ నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుండి 25 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ కొత్త నిబంధనల వల్ల అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి, బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: