Sri Lanka: శ్రీలంకలోని జాఫ్నాలో ఉన్న చెమ్మణి సామూహిక సమాధుల తవ్వకాల్లో మరో ఎనిమిది మానవ అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. వీటిలో ఒక చిన్నారు అస్థిపంజరం, దానితోపాటు పిల్లలు వాడే ఫీడింగ్ బాటల్ వంటి వ్యక్తిగత వస్తువులు కూడా లభ్యమయ్యాయి. దీనితో ఈ ప్రాంతంలో పాతిపెట్టబడిన వారిలో తమిళ చిన్నారులు (Tamil girls) కూడా ఉన్నారనే ఆందోళనలు మరింత పెరిగాయి. అంతర్యుద్ధంలో జరిగిన మారణహోమం 1996లో శ్రీలంక (Sri Lanka) సైన్యం జాఫ్నా పెనిస్సులాను స్వాధీనం చేసుకున్న తర్వాత, వందలాదిమంది తమిళులు అపహరణకు గురయ్యారని, నిర్బంధించబడ్డారని, అలాగే చట్టవిరుద్ధంగా చంపబడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ సామూహిక సమాధులు ఆ సైనిక చర్యల్లో చంపబడిన వారివేనని కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు మొదటి నుంచీ వాదిస్తున్నాయి.

చెమ్మణ్ణిలో ఫోరెన్సిక్ తవ్వకాల్లో మరో 15 అస్థిపంజరాలు వెలుగు
ఈ మారణహోమంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని వారు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. చెమ్మణ్ణి సమాధులు ఆ చీకటి రోజులకు ఒక భయానక సాక్ష్యంగా నిలిచాయి. కొత్త అస్థిపంజరాలు కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం చెమ్మణ్ణిలో జరుగుతున్న ఫోరెన్సిక్ తవ్వకాల్లో (forensic excavations) ఈ కొత్త అస్థిపంజరాలు బయటపడ్డాయి. 45 రోజులపాటు జరిగే ఈ దశలో ఇది 17వ రోజు. బుధవారం లభించిన వాటితో కలిపి, కేవలం రెండు రోజుల్లోనే మొత్తం పదిహేను అస్థిపంజర అవశేషాలను గుర్తించారు. ఈ దశలో ఇప్పటివరకు మొత్తం 65 మానవ అవశేషాలను పూర్తిగా వెలికితీయగా, మొత్తం గుర్తించిన మృతదేహాల సంఖ్య 80కి చేరింది.
శ్రీలంకలో జాతుల మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు
దశాబ్దాల పోరాటం శ్రీలంకలో తమిళులకు, స్థానికుల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నది. తమిళులు తమకు రాజ్యాధికారాలతో పాటు ఆదేశ పౌరులుగానే చూడాలనే డిమాండ్ పెరగడంతో ఆరంభమైన ఘర్షణలు అనేకులు తమ ప్రాణాలనే కోల్పోయారు. జాతులమధ్య విభేదాలతో నిత్యం ఇక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు వాడే పాలు తాగే బాటిల్, కొన్ని గుడ్డముక్కలు ఉండడం వల్ల ఇక్కడ పాతిపెట్టబడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ దర్యాప్తు డిమాండ్లు ఈ దర్యాప్తును ఇప్పటివరకు జాఫ్నాలోని శ్రీలంక పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాలతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) అధికారులు కూడా రంగంలోకి దిగారు. సీఐడీ దర్యాప్తు చేపట్టడంపై తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో కొన్ని వివాదాలు తలెత్తాయని తెలుస్తోంది.
శ్రీలంక పిల్లలకు అనుకూలంగా ఉందా?
శ్రీలంక ఒక అద్భుతమైన కుటుంబ సెలవు గమ్యస్థానం , ఆసియాలోని అనేక ప్రాంతాలలో మీకు దొరకని వన్యప్రాణులతో సహా, చేయడానికి మరియు చూడటానికి చాలా ఉన్నాయి.
18 ఏళ్లు పైబడిన భారతీయుల సంఖ్య?
2023లో, భారత జనాభాలో దాదాపు 25.06 శాతం మంది 0-14 సంవత్సరాల వర్గంలోకి వచ్చారు, 68.02 శాతం మంది 15-64 సంవత్సరాల వయస్సు వారు మరియు 6.92 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటి మరియు దాని జనాభా నిరంతరం పెరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Accident: బ్రిడ్జిని ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. 15మందికి గాయాలు