బంగ్లాదేశ్ మాజీ ప్రధాని(Bangladesh ex PM) షేక్ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన ఒక కీలకమైన ఆడియో లీక్(Audio Leak) కావడంతో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన ఆందోళనల సమయంలో నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆమె స్వయంగా ఆదేశించినట్లు ఈ ఆడియోలో ఉంది. ఈ ఉదంతం ఇప్పుడు బంగ్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీబీసీ(BBC)కి చెందిన పత్రాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను ప్రచురించాయి. దీని ప్రకారం, గత సంవత్సరం జులై 18న ఢాకాలోని తన అధికార నివాసం ‘గణభబన్’ నుంచి ఒక ఉన్నత పోలీస్ అధికారికి హసీనా ఫోన్లో ఈ ఆదేశాలు జారీ చేశారు.

వాళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయండి
“నిరసనకారులను అణచివేయడానికి ప్రాణాంతక ఆయుధాలు వాడండి. వాళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చేయండి” అని ఆమె ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ అయిన కొద్ది గంటలకే పోలీసులు నిరసనకారులపై బలప్రయోగం చేసినట్లు బీబీసీ నివేదిక వెల్లడించింది. కాగా, బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి తీవ్ర అల్లర్లకు దారితీశాయి. ఈ ఘర్షణల్లో సుమారు 1,400 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం ఆమె దేశం విడిచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
హసీనా దేశం విడిచి భారత్లో ఆశ్రయం
తాత్కాలిక ప్రభుత్వం హసీనాను రప్పించాలనే యత్నంలో
ఆందోళనల తరువాత హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె భారత్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ఆమెను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది .
షేక్ హసీనా భారతదేశంలో ఎందుకు ఉన్నారు?
దేశ స్వాతంత్ర్యం తర్వాత ఆమె రెండవ పదవీకాలం అత్యంత సుదీర్ఘమైన పరిపాలన, విమర్శకులు దీనిని నియంతృత్వం, సామ్రాజ్యవాదం మరియు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలతో వర్ణించారు. 2024 జూలై విప్లవం తరువాత ఆమె రాజీనామా చేసి భారతదేశానికి బహిష్కరించబడ్డారు.
షేక్ హసీనా ఎందుకు రాజీనామా చేశారు?
నెలల తరబడి నిరసనలు కొనసాగాయి, హింసాత్మక అణచివేత మరియు నిరసనకారుల హత్యల తరువాత, హసీనా మరియు ఆమె పరిపాలన నిరసనకారుల ప్రధాన సంస్థ, స్టూడెంట్స్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్, పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Gujarat : గుజరాత్లో కూలిన భారీ వంతెన.. తొమ్మిది మంది మృతి!