📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: పాక్ కాల్పుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత విదేశాంగ కార్యదర్శి

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకుంది. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు(Tensions) అమెరికా మధ్యవర్తిత్వంతో కాస్త తగ్గుముఖం పట్టాయి.కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, పాకిస్తాన్ వెంటనే ఉల్లంఘనకు పాల్పడింది.సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. మే 12న దీనిపై ఇరు దేశాల అధికారులు సమావేశమైన ఓ అవగాహన ఒప్పందానికి రావాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌(Jammu & Kashmir)లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌(Pok)లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులతో విరుచుకుపడింది. భారత్ సైనిక చర్యను జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్ భారత్ సరిహద్దుల్లోని డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి యత్నించింది. దీంతో భారత సైన్యం ఈ దాడులను సమర్ధవంతంగా అడ్డుకుని తిప్పికొట్టింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. 

ఉల్లంఘనల

భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి(Vikram Misri) మాట్లాడుతూ, ‘భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటూ నిఘా నిర్వహిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాం,’ అని తెలిపారు. ‘ఈ సాయంత్రం భారత, పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ల మధ్య వచ్చిన అవగాహనను కొన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘిస్తోంది. ఇది ఈ రోజు వచ్చిన ఒప్పందానికి విరుద్ధంగా సాగుతుంది.ఈ ఉల్లంఘనలను భారత సైన్యం తగిన విధంగా ప్రతిస్పందిస్తోంది. ఈ చర్యలను మేము చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాం.పాకిస్థాన్ ఈ ఉల్లంఘనలపై బాధ్యతాయుతంగా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం.ప్రస్తుత పరిస్థితిపై భారత సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయి.అంతర్జాతీయ సరిహద్దు(international border), నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే, కఠినంగా స్పందించాలనే ఆదేశాలు వారికి జారీ అయ్యాయి. అంటూ విక్రం మిస్రీ ప్రకటించారు.

Operation Sindoor: భారత విదేశాంగ కార్యదర్శి

పేలుళ్ల శబ్దాలు

జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్ డ్రోన్ కనింపించడం తీవ్ర కలకలం రేపింది. శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపించినట్టు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేసారు.కాల్పుల విరమణ లేనట్టేనని పేర్కొన్నారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ యాక్టివేట్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్‌ రాజస్తాన్‌లోని జైసల్మేర్, బర్మేర్‌‌లలో బ్లాక్‌అవుట్ విధించారు. గుజరాత్‌లోని కచ్‌లో డ్రోన్లు కలకలం రేపాయి.

Read Also: Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

#IndiaStrikesBack #IndoPakTensions #PahalgamAttack #TerrorResponse Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.