భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఓ ఉదంతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీమిండియా (Team India) వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ అంపైర్తో జరిగిన వాగ్వాదంతో వార్తల్లో నిలిచాడు.బంతిని మార్చాలని రిషబ్ పంత్ కోరాడు, కానీ అది జరగకపోవడంతో అంపైర్తో గొడవపడ్డాడు. భారత జట్టు వైస్ కెప్టెన్ అంపైర్తో చాలా సేపు వాదించాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (Rishabh Pant) కోపంతో అంపైర్ ముందు బంతిని నేలపై పడేశాడు. రిషబ్ పంత్ ఈ ప్రవర్తన అతనికి సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. ఐసీసీ నిబంధనలు రెండింటిని ఉల్లంఘించినందుకు రిషబ్ పంత్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.మైదానంలో అంపైర్తో గొడవపడినందుకు రిషబ్ పంత్కు రెండు నిబంధనల ఉల్లంఘన కారణంగా శిక్ష పడవచ్చు.
నిర్ణయంపై
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8లోని లెవెల్ 1 కింద అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు రిషబ్ పంత్ను దోషిగా పరిగణించవచ్చు. దీనితో పాటు క్లాజ్(ఎ), క్లాజ్(హెచ్) కింద అంపైర్ నిర్ణయంపై సుదీర్ఘ చర్చలు (Long discussions) జరిపినందుకు కూడా రిషబ్ పంత్ను ధోషిగా పరిగణించవచ్చు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినందుకు కూడా భారత వైస్ కెప్టెన్ను దోషిగా పరిగణించవచ్చు. రిషబ్ పంత్ కోపంతో అంపైర్ దగ్గరే బంతిని విసిరాడు, దీనికి అతనికి కఠిన శిక్ష లభించవచ్చు.నిజానికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో హ్యారీ బ్రూక్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో భారీ ఫోర్ కొట్టాడు.
అసలేం జరిగింది?
దీని తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బంతి మార్చాలని అంపైర్ను కోరారు. అంపైర్ బంతిని పరిశీలించి అది ఇంకా ఆడేందుకు అనుకూలంగా ఉందని చెప్పాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ తీవ్రంగా కోపోద్రిక్తుడై అంపైర్ (Umpire) తో వాదించాడు. తన మాట వినకపోవడంతో రిషబ్ పంత్ కోపంతో అంపైర్ ముందు బంతిని నేలపై పడేశాడు. ఏదో మాట్లాడుతూ వెనక్కి తిరిగాడు. రిషబ్ పంత్ ఈ ప్రవర్తన చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా అరుపులు, కేకలు వేశారు.
Read Also: Dinesh Karthik: బుమ్రా కపిల్ దేవ్ కంటే గొప్ప బౌలర్ :దినేశ్