हिन्दी | Epaper
H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

Qatar: ఖతార్ లోభారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్..ఎందుకంటే?

Sharanya
Qatar: ఖతార్ లోభారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్..ఎందుకంటే?

ఖతార్‌లో భారత సాంకేతిక రంగానికి చెందిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్న అమిత్ గుప్తాను ఖతార్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఆయనపై డేటా చౌర్యం ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై భారత ప్రభుత్వం, అమిత్ గుప్తా కుటుంబం, టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ వివిధ చర్యలు తీసుకుంటున్నాయి.

Amit Gupta 1742727846295 1742727854429

అమిత్ గుప్తా ఖతార్‌లో టెక్ మహీంద్రా సంస్థకు చెందిన ఖతార్-కువైట్ రీజియన్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలో ఉన్న గోప్యమైన డేటాను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు నిజానిజాలు ఇంకా బయటకు రాలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

టెక్ మహీంద్రా స్పందన

ఈ అరెస్టు నేపథ్యంలో టెక్ మహీంద్రా గ్రూప్ స్పందిస్తూ, తమ ఉద్యోగికి పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. అమిత్ గుప్తా కుటుంబానికి అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది. అంతేగాక, ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కంపెనీ పరంగా, తమ ఉద్యోగి నిర్దోషి అని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండేలా కుటుంబానికి సహాయం చేస్తామని తెలిపింది.

భారత రాయబార కార్యాలయం స్పందన

ఖతార్‌లో భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై స్పందించింది. అమిత్ గుప్తా విషయంలో ఖతార్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని, అతన్ని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ఈ కేసును దగ్గరగా గమనిస్తూ, అన్ని దిశలలోనూ కృషి చేస్తోందని పేర్కొంది. ఖతార్ ప్రభుత్వం, అక్కడి న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసు అమిత్ గుప్తా కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా అమిత్ గుప్తా తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు పూర్తిగా నిర్దోషి అని పేర్కొన్నారు. సంస్థలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, రీజియన్ హెడ్‌గా తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారని ఆమె వాపోయారు. గత కొద్దీ రోజులుగా తమ కుమారుడు తమతో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చిందని, అతని స్నేహితులకు కాల్ చేయగా అరెస్టు విషయం బయటకు వచ్చిందని తెలిపారు. సమాచారం ప్రకారం, జనవరి 1న ఖతార్ పోలీసులు అమిత్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి మూడు నెలలుగా దోహాలో అతడిని నిర్బంధంలో ఉంచారు. కుటుంబ సభ్యులు ఈ విషయంపై తమ స్థానిక నాయకులను ఆశ్రయించారు. గుజరాత్‌లోని వడోదర ఎంపీ హేమాంగ్ జోషిని కలిసి, తమ కుమారుని విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎంపీ స్పందిస్తూ, దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అమిత్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారత అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

క్రికెట్‌లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

వెనిజులా నుండి భారత్ చమురు కొంటుందా?

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

📢 For Advertisement Booking: 98481 12870