భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ దిగుమతులపై విధించిన ఆంక్షల నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. ఇటీవల, యూనస్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఉత్తర-పూర్వ రాష్ట్రాలకు బంగ్లాదేశ్ ద్వారా సముద్ర మార్గం ద్వారా ప్రాప్యతను పరిమితం చేయడం ద్వారా ఆ ప్రాంతాల ఆర్థిక శక్తిని ప్రభావితం చేయగలదని సూచించారు. భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ప్రాంతీయ సహకారం మరియు ఆర్థిక సమగ్రతకు ముప్పుగా భావించి, ప్రతిస్పందనగా ఈ ఆంక్షలను విధించింది .ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ.. వాణిజ్య ఆంక్షలపై భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని అన్నారు.

ఎగుమతులపై ఆంక్షలు
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధినేతగా మారిన మహమ్మద్ యూనస్.. భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఇండియాపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ.. భారత్తో వివాదం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా గత నెలలో ఇండియా నుంచి వస్తున్న సరుకులపై బంగ్లా భారీ ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిస్పందనగా న్యూఢిల్లీ సైతం ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు పెట్టింది.
ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్కతా, నవసేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్లోకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటిని ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు 5 వారాల క్రితం ట్రాన్స్షిప్మెంట్ అవగాహనను కూడా భారత్ రద్దు చేసింది. దీంతో ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.
Read Also : Former Brazilian President: బోల్సోనారోపై తిరుగుబాటు ఆరోపణలపై విచారణ