📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: పహల్గాం దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!

Author Icon By Vanipushpa
Updated: April 26, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో హమీ ఇచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దయింది. ‘ఆర్టికల్ 370ని ఒక టూల్‌గా వాడి కశ్మీర్‌లో బీభత్సం, హింస, అవినీతిని వ్యాప్తి చేస్తున్నారు’ అని నరేంద్ర మోదీ ఆ సమయంలో అన్నారు. గత పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, పహల్గాంలో తాజా దాడి భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల కాలంలోని తీవ్రవాద దాడులలో ఈనెల 22న జరిగిన దాడి అత్యంత దారుణమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ దాడి తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ సంఘటన తర్వాత ప్రభుత్వ విధానం ఎలా ఉండనుంది?.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి, కొందరు నిపుణులతో మాట్లాడింది.‘స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు’. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడమనేది 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన హామీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ చర్య జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతుందని ప్రభుత్వం చెప్పింది. భారత్‌లోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జమ్మూకశ్మీర్‌లో భూమిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపింది. పర్యాటకం, భద్రత అనేది జమ్మూకశ్మీర్ పాలసీలో ముఖ్యభాగంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో పర్యటకుల సంఖ్య పెరిగిందని కేంద్రం చాలాసార్లు చెప్పింది. గణాంకాలు కూడా దీనిని ప్రతిబింబించాయి.
ఆర్టికల్ 370 రద్దు ప్రభావం ఎంత
ఆర్టికల్ 370 రద్దు చేసిన ఐదేళ్ల తర్వాత, 2024లో ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇది జరిగింది. శ్రీనగర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. కశ్మీరీలు ఇప్పుడు ‘స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు’ అన్నారు. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పురోగతి కొత్త శిఖరాలను తాకుతోంది. స్థానిక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాతే ఇది జరిగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆర్టికల్ 370 గురించి జమ్మూకశ్మీర్‌ను, దేశ ప్రజలను తప్పుదారి పట్టించాయి” అన్నారు మోదీ. “రాజకీయ విధానం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ప్రతిరోజూ ముస్లిం జనాభాను దూరం చేసేలా, హిందూ జనాభాను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేస్తున్నారు” అని అజయ్ అన్నారు. “క్రమంగా ఇలాంటివాటికి ముగింపు పలుకుతూ మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారతీయ గుర్తింపులోకి తీసుకురావాలి. ఇది భారతీయ సమగ్రతను చాటేలా ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఇతర అతివాద ఈ సంఘటన ప్రభుత్వ ప్రతిష్ఠపై, దాని కశ్మీర్ విధానంపై ఎటువంటి ప్రభావం చూపబోదని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ”
Read Also: Amit Shah : పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్ళాలి

#telugu News after Pahalgam attack! Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News People's concerns over Kashmir security Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.