📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Gaza: గాజాలో పార్లే-జీ బిస్కట్ ప్యాకెట్ ధర రూ.2300 పైమాటే!

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన దేశంలో ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పేరు పార్లే-జీ(parle biscuit). చౌకగా లభించే తినుబండారాల్లో బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజా(Gaza)లో ఇదే పార్లే-జీ బిస్కెట్లు వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక ధరకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఈ మేరకు ఆంగ్ల మీడియా ఎన్డీటీవీ(NDTV)లో కథనం వచ్చింది.
గాజా నుండి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్టులో, ముంబై కేంద్రంగా పనిచేసే పార్లే ప్రొడక్ట్స్ తయారుచేసిన పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ 24 యూరోలకు (సుమారు రూ. 2,342) పైగా అమ్ముడవుతోందని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. భారత్‌లో అత్యంత చౌకైన ఆహార పదార్థాలలో ఒకటిగా నిలిచిన ఈ బిస్కెట్ల ధర అంత ఎక్కువగా ఉండటం చూసి సామాజిక మాధ్యమంలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Gaza: గాజాలో పార్లే-జీ బిస్కట్ ప్యాకెట్ ధర రూ.2300 పైమాటే!

గాజాకు ఆహార సరఫరా తగ్గిపోయింది
“చాలా కాలం నిరీక్షణ తర్వాత, రఫీఫ్‌కు ఇష్టమైన బిస్కెట్లను ఈరోజు నేను సంపాదించగలిగాను. వాటి ధర 1.5 యూరోల నుండి 24 యూరోలకు పైగా పెరిగినప్పటికీ, రఫీఫ్‌కు ఇష్టమైన ఈ చిరుతిండిని కాదనలేకపోయాను” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టును మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి ఇటీవల షేర్ చేశారు.
అక్టోబర్ 2023లో ఉద్రిక్తతలు పెరిగి, ఆ తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుండి గాజాకు ఆహార సరఫరా క్రమంగా తగ్గిపోయింది. ఈ ఏడాది మార్చి 2 నుండి మే 19 మధ్య, ఈ పాలస్తీనియన్ ప్రాంతం దాదాపు పూర్తి దిగ్బంధనాన్ని ఎదుర్కొంది.
బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముడవుతాయి
అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తులను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. “సమస్య సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు” అని గాజా నగరంలో నివసిస్తున్న సర్జన్ డాక్టర్ ఖలీద్ అల్షవ్వా చెప్పారు. “ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయం కింద ఉచితంగా గాజాలోకి వస్తాయి. కొద్దిమంది చేతిలోకి మాత్రమే అవి వస్తాయి. కొరత కారణంగా ఇవి బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముడవుతాయి” అని ఆయన వివరించారు. పార్లేజీ ధర కొన్నిచోట్ల రూ. 2,000 పలుకుతున్నప్పటికీ, తాను మాత్రం రూ. 240కి కొనుగోలు చేయగలిగానని సదరు సర్జన్ డాక్టర్ తెలిపారు.
ఉత్తర గాజాలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల ప్రస్తుత మార్కెట్ ధర భారతీయ రూపాయిలో చూస్తే, ఒక కిలో చక్కెర రూ. 4,914, ఒక లీటర్ వంట నూనె రూ. 4,177, ఒక కిలో బంగాళాదుంపలు రూ. 1,965, ఒక కిలో ఉల్లిపాయలు రూ. 4,423, ఒక కప్పు కాఫీ రూ. 1,800గా ఉన్నాయి.

Read Also: MBBS Student: వియత్నాంలో తెలంగాణ మెడికో దుర్మరణం

#telugu News Ap News in Telugu biscuits in Gaza is over Rs. 2300! Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Parle-G biscuits Telugu News online Telugu News Paper Telugu News Today The price of a packet

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.