📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: భారత సోషల్ ఇన్ ఫ్లూయన్సర్లపై పాక్ వల?

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ లో పాకిస్తాన్ కు సాయం చేస్తున్న వారిపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది. ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వదిలేసిన చాలా మందిని ట్రాక్ చేసి వారిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతోంది. ఇందులో మన దర్యాప్తు సంస్థలకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సాయం చేస్తున్న సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్ల వరుస అరెస్టుల తర్వాత తేలిన లింక్ మేడమ్ ఎన్.
పాకిస్తాన్ లో వ్యాపారవేత్తగా ఉన్న నోషబా షెహజాద్ అనే మహిళ ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తరఫున పనిచేస్తూ భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను ట్రాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న నోషబా ను మేడమ్ ఎన్ గా సంబోధిస్తున్నారు. ఆమె భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను గుర్తించి వారిని సంప్రదించి పాకిస్తాన్ కు రప్పించి వారి నుంచి భారతీయ సమాచారం తెలుసుకుంటున్నట్లు గుర్తించారు. దర్యాప్తు సంస్థలు ఎంతోకాలంగా నిశ్శబ్దంగా ఉన్న నిందితులను ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.

Pakistan: భారత సోషల్ ఇన్ ఫ్లూయన్సర్లపై పాక్ వల ?

జ్యోతి మల్హోత్రా వలలో పలువురు ఇన్ ఫ్లూయెన్సర్లు
ఈ మధ్య కాలంలో అరెస్టు అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లంతా ఈమె వలలో పడిన వారేనని తేలింది. లాహోర్ కేంద్రంగా జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ట్రావెల్స్ సంస్థ నడుపుతున్న ఈమె.. ఆ ముసుగులో భారత్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను భారీ మొత్తాలు ఆఫర్ చేసి తనవైపుకు తిప్పుకుంటున్నట్లు తేలింది. దీంతో వారు డబ్బుకు ఆశపడి దేశం దాటి వెళ్లి మరీ పాకిస్తాన్ వెళ్లి మన రహస్యాలు బయటపెడుతున్నట్లు తెలిసింది. భారత్ లో ఇలా 500 మంది స్లీపర్ షెల్స్ ను ఆమె నియమించినట్లు మన దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
3 వేల మంది పౌరుల్ని, 1500 మంది ఎన్నారైలను పాకిస్తాన్ కు రప్పించారు
పాకిస్తాన్ కు చెందిన ఓ రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారి భార్య అయిన ఆమె.. పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ పంపుతున్న సూచనల ఆధారంగా భారత్ లో స్లీపర్ షెల్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని పాక్ ఆర్మీ, ఐఎస్ఐకి పరిచయం చేస్తుందని, ఆ తర్వాత వారు సమాచారం అందిస్తారని తెలుస్తోంది. ఇలా భారత్ కు చెందిన 3 వేల మంది పౌరుల్ని, 1500 మంది ఎన్నారైలను ఆమె పాకిస్తాన్ కు రప్పించినట్లు గుర్తించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీని సైతం ఆమె వాడుకుంటున్నట్లు తేలింది. ఇందులో ముఖ్యంగా హిందువులు, సిక్కులే ఉన్నారు. వారిని పాకిస్తాన్ లో ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్ళన పేరుతో రప్పిస్తూ వారి నుంచి వివరాలు తీసుకుంటున్నట్లు తేలింది. ఆమెకు ఎంబసీకి మద్దతు ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. దేశభద్రతను ప్రమాదంలో పడేసే ఇటువంటి కుట్రలపై భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు తీవ్ర గమనంతో చర్యలు తీసుకుంటున్నాయి.

Read Also: Elon Musk: ఆ ఫైల్స్​లో ట్రంప్ పేరు కూడా ఉంది..ఎలాన్ మస్క్ ఆరోపణలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan's Paper Telugu News social influencers? Telugu News online Telugu News Paper Telugu News Today trap on Indian

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.