జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి తరువాత.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
త్రివిధ దళాలు పూర్తిగా యాక్టివేట్ అయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు.

పాకిస్తానీయుల ఏరివేత
దేశంలో అనధికారికంగా నివసిస్తోన్న పాకిస్తానీయుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. దేశం విడిచి వెళ్లిపోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా వారిపై నిఘా ఉంచాయి. అనుమానిత ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోన్నాయి. అటు సరిహద్దుల్లోనూ భద్రత కట్టుదిట్టమైంది. పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటోన్న సమీప గ్రామాలు, ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలన్నీ కూడా భద్రత సిబ్బంది రాడార్లోకి వెళ్లిపోయాయి. అధికారిక డాక్యుమెంట్లు ఉంటే తప్ప పాకిస్తానీయులు దేశంలో ఎక్కడే గానీ నివసించే పరిస్థితి ఉండట్లేదు. ఈ పరిణామాల మద్య పంజాబ్లోని గురుదాస్పూర్లో ఓ పాకిస్తానీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఆ దేశ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులను దాటుకుని అక్రమంగా భారత భూభాగంపైకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లుగా తేలింది.
Read Also: Chinab: చీనాబ్ నీటికి బ్రేక్.. భారత్ నిర్ణయంతో పాక్కు నీటి కష్టాలు!