📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

In-Pakistan: ఇకపై పాక్​ విమానాలకు భారత్​లో ప్రవేశం నిషిద్ధం

Author Icon By Vanipushpa
Updated: May 1, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది.

ఏప్రిల్‌ 30 నుంచి మే 23 వరకు అమలు
రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలోనే పాక్‌ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్‌ కూడా దీటుగా స్పందించింది. పాక్‌ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటమ్‌ జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది. దీంతో పాక్‌కు సంబంధించిన కమర్షియల్‌, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవవడానకి అవకాశం లేదు.
చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం
భారత్​ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్థాన్​ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ విమానాలు కౌలాలంపూర్‌ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. ఈ నిర్ణయం, రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైనిక సంబంధాలను మరింత సంక్షోభం తీసుకురావచ్చు. పాకిస్థాన్‌ విమానయాన సంస్థలు దీని వల్ల ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కొత్త మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది.

పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లపై ఆర్థిక ప్రభావం
ఈ నిర్ణయంతో పాకిస్థాన్​ ఎయిర్‌లైన్లకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్​ విమానాలు మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి గమ్యస్థానాలకు వెళ్లడానికి చైనా, శ్రీలంక గుండా దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది.

Read Also: Sundar Pichai: సుందర్ పిచాయ్ సక్సెస్ కు భార్య అంజలినే కారణమా!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistani flights Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to enter India will no longer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.