📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్

Author Icon By Anusha
Updated: April 24, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది.2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దారుణమైన ఉగ్రవాద చర్యను ఖండించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, దీనికి స్థానికుల మద్దతు ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ‘ఈ ఉగ్రవాదులు ఎందుకు హిందువులపైనే దాడులు చేస్తున్నారు కాశ్మీరీ పండితులు లేదా భారతదేశం నలుమూలల నుంచి వచ్చే హిందూ పర్యాటకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? స్థానిక ఉగ్రవాదుల సహాయం లేకుండా ఇటువంటి దాడులు జరగవు’అని ట్వీట్ లో రాసుకొచ్చాడు కనేరియా. అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ కూడా పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించాడు. ‘ ఈ ఉగ్రదాడితో నా హృదయం ముక్కలైంది’ అని ట్వీట్ చేశాడు హఫీజ్.

విహారయాత్ర

ప్రత్యక్ష సాక్షి

ఫుడ్‌స్టాల్స్‌ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.,పహల్గామ్‌లో పర్యాటకులపై కొంతమంది ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ సమయంలో, పర్యాటకులను వారి మతం గురించి అడిగి, వారు హిందువులని తెలుసుకున్న తర్వాత ఉగ్రవాదులు వారిని కాల్చి చంపారని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కాశ్మీర్‌కు విహారయాత్రకు వచ్చిన వారే. దీంతో కోపోద్రిక్తులైన భారతీయులు,ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఉగ్రవాదులతో పాటు కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌కు కూడా గుణపాఠం చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

విడుదల

ఈ దాడి నేపథ్యంలో పహల్గాంలో ఎన్ఐఏ బృందం స్థానిక పోలీసులకు సాయంగా అక్కడకు చేరుకుంది. కాల్పులు జరిపారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్‌లు విడుదల చేశారు.పర్యాటక, ట్రెక్కింగ్ సీజన్ ఊపందుకుంటున్న సమయంలో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళనకలిగిస్తోంది. పర్యాటక రంగానికి ఇది తీవ్రమైన దెబ్బగా మారుతుందని, ఈ పరిశ్రమపై ఆధారపడే స్థానికుల జీవనాధారంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Read Also:All-party meeting : ఉగ్రదాడి ఘటన…నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

#HinduLivesMatter #Kashmir #KashmiriPandits #StopTerrorism #Terrorism Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.