📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Pahalgam Attack: దాడి చేసింది పాకిస్థాన్ ఎస్‌ఎస్‌జీ కమాండోలు- మాజీ డీజీపీ

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన విధానం, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉందని జమ్ముకశ్మీర్‌ మాజీ డీజీపీ శేష్‌ పాల్ వైద్ అన్నారు. భారత్‌పై జరిగిన ఈ దాడిని ‘పుల్వామా 2’గా భావించాలని తేల్చిచెప్పారు. “రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్‌ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్‌ కూడా అలానే చేయాలి. వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్‌ సైన్యంలోని ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్‌) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.” శేష్‌ పాల్ వైద్, జమ్ముకశ్మీర్‌ మాజీ డీజీపీ

పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే దాడి
‘బలూచిస్థాన్‌, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్‌,
పీఓకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పాకిస్థాన్ సైన్యం చేసిన ఈ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, స్వాతంత్య్రం ప్రకటించుకోండి. అంతేకాదు, పాకిస్థాన్‌ సైన్యం వెన్నువిరిచి, భారత్ దాన్ని నాలుగు ముక్కలుగా నరకాలి’ అని శేష్‌ పాల్ వైద్ అన్నారు.
“వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

read Also:Pahalgham Terrorist: పహల్గాం ఉగ్ర‌వాది ఫొటో బ‌య‌ట‌కు.. సోషల్ మీడియాలో వైర‌ల్‌!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu carried out the attack former DGP Google News in Telugu Latest News in Telugu Pakistan SSG commandos Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.