భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్ పట్ల భారత్ వైఖరిలో మార్పు లేదని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, పీవోకేను అప్పగించడంపై తప్పా ఇతర విషయాలపై చర్చించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. అలాగే పాక్ వద్ద పూర్తి ఉగ్రవాదుల జాబితా ఉందని దాన్ని తమకు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అలాగే వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఆపేస్తే తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధం అని పేర్కొన్నారు.భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు ప్రతికారంగా పాకిస్థాన్ దాడి ప్రయత్నాలు చేయగా వాటిని భారత్ తిప్పికొట్టింది. పాక్ అణుస్థావరాలకు సమీపంలోని ఎయిర్ బేస్(Air base)లపై భారత్ దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇక భారత్తో పెట్టుకుంటే బతకలేమని అర్థం చేసుకున్న పాక్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ పాటిద్దామని, చర్చలు జరుపుదామని వేడుకుంది. దీంతో భారత్ కాల్పుల విరమణ పాటిస్తోంది. అయితే ఆపరేషన్ సిందూర్కు ముందే భారత్ పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం.
మరోసారి
సింధూ నదీ జలాల ఒప్పందం యుద్ధానికి తీసిపోదని గుర్తించిన పాక్ భారత్ను వేడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సింధూ నదీ జలాలు లేకపోతే, పాకిస్థాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుంది. దీంతో సింధూ నదీ జలాలు ఇవ్వాలని, ఒప్పందాన్ని కొనసాగించాలని పాక్ వేడుకుంటోంది. అయితే పాక్తో సింధూ నదీ జలాలతో పాటు మరే ఇతర అంశాలపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఉగ్రవాదంపై, పీవోకేను తిరిగి భారత్కు అప్పగించడంపై మాత్రమే చర్చలు జరుగుతాయని మరోమారు స్పష్టం చేసింది. ఈమేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్(Jaishankar) భారత వైఖరిని పునరుద్ఘాటించారు. సరిహద్దు ఉగ్రవాదం సమస్య పరిష్కారం అయ్యే వరకు సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని అన్నారు.పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై జైశంకర్ మరోసారి మాట్లాడారు. పాక్ వద్ద ఉగ్రవాదుల జాబితా ఉందని, దానిని అప్పగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్థాన్తో సంబంధాలు, వ్యవహారాలు పూర్తిగా ద్వైపాక్షికంగా మాత్రమే ఉంటాయన్నారు. అందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్తో చర్చలు కేవలం ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు.
Read Also: Unemployment: నిరుద్యోగుల్లో పురుషులే అధికం..ఏప్రిల్లో నిరుద్యోగ రేటు ఎంతంటే!