Pakistan: పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 79 మంది మృతి!

Read Time:  1 min
పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 79 మంది మృతి!
పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 79 మంది మృతి!
FONT SIZE
GET APP

పాకిస్తాన్‌(Pakistan)కు వరుస షాక్‌లు ఎదురు అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పాక్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పు పంజాబ్(Punjab), బలూచిస్తాన్Balochistan), ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, సింధ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. వరదల వల్ల దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వ్యవసాయ భూములు, పంటలు, రోడ్లు, వంతెనలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Pakistan: పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 79 మంది మృతి!
Pakistan: పాకిస్తాన్‌లో వరద బీభత్సం.. 79 మంది మృతి!

నేపాల్, చైనాలో కూడా..
ఇదిలా ఉండగా ఇటీవల నేపాల్‌-చైనా సరిహద్దులో కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నది నుంచి వరద ఉధృతంగా రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపుగా 200లకు పైగా వాహనాలు ఈ వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

వేలాది ఇళ్లు, మౌలిక వసతులు ధ్వంసం

వరదల కారణంగా వేలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులు, వంతెనలు, పాఠశాలలు, మరియు వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు నశించడంతో రైతులకు భారీ నష్టం ఏర్పడింది. ఇటీవల నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడ వరదలు బీభత్సం సృష్టించాయి. భోటెకోషి నది ఉప్పొంగి మిటేరి వంతెనను కొట్టుకుపోయింది. నదీ తీరంలో ఉన్న డ్రైపోర్ట్‌లో నిలిపి ఉంచిన సుమారు 200 వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. బాధితుల తరలింపు, సహాయ చర్యలు, పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని పాక్ అధికారులు తెలిపారు .

పాకిస్తాన్‌లో జరిగిన ఇతర ముఖ్యమైన వరద సంఘటనలు:
2019 వరదలు ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు పంజాబ్‌లలో విస్తృతంగా ఆకస్మిక వరదలకు కారణమయ్యాయి.

2011 బలూచిస్తాన్ వరదలు మరియు 2011 కోహిస్తాన్ వరదలు కూడా గణనీయమైన నష్టాన్ని మరియు స్థానభ్రంశాన్ని కలిగించాయి.

గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో 2010 వరదలు కొండచరియలు విరిగిపడి ప్రధాన రహదారులను అడ్డుకున్నాయి.

సింధ్ ప్రావిన్స్‌లోని 2003 వరదలు తట్టా జిల్లాలో గణనీయమైన పట్టణ వరదలు మరియు ఆకస్మిక వరదలకు కారణమయ్యాయి.

పంజాబ్ ప్రావిన్స్‌లోని 1973 వరదలు భారత కాశ్మీర్‌లో భారీ వర్షాల వల్ల సంభవించాయి.

1992 ఇండియా-పాకిస్తాన్ వరదలు కూడా విస్తృత నష్టాన్ని కలిగించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Prashant Kishor : విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.