📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: సరిహద్దుల్లో చైనా శతఘ్నులను మోహరిస్తున్న పాక్

Author Icon By Vanipushpa
Updated: April 28, 2025 • 5:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కశ్మీర్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన దాడి, ఆపై సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలక సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ (స్వయంచోదక శతఘ్ని) వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలించింది.

సోషల్ మీడియాలో వైరల్
పాకిస్థాన్ బలగాలు భారీ చైనా ఆయుధాలను తరలిస్తున్నట్లు చూపుతున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కశ్మీర్ ఘటన తర్వాత రెండు రాత్రుల పాటు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగిన అనంతరం ఈ ఆయుధాల మోహరింపు జరగడం గమనార్హం. ఈ పరిణామం సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతోంది.
పెద్ద ఎత్తున సైనిక సహకారం
తాజా నివేదికల ప్రకారం, చైనా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఇస్లామాబాద్‌కు బీజింగ్ పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోందనే వాస్తవాన్ని ఈ ఎస్ హెచ్-15 ఫిరంగుల మోహరింపు మరోసారి స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఈ పరిణామం సూచిస్తోంది.
అప్రమత్తమైన భారత భద్రతా దళాలు
చైనా తయారీ ఎస్ హెచ్-15 ఫిరంగులు అధునాతనమైనవి, వేగంగా కదిలించగల సామర్థ్యం కలిగినవిగా రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ తన సరిహద్దుల వద్ద చైనా ఆయుధాలను మోహరించడంపై భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Read Also: Bharath, Pakistan: ఇరుదేశాలు యుద్ధ సన్నాహాలకు సిద్ధం..దిగజారుతున్న పాక్ ఆర్థిక పరిస్థితి

Breaking News in Telugu Chinese artillery Google news Google News in Telugu Latest News in Telugu on borders Pakistan deploys Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.