భారత్, పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం తప్పదా అన్న విధంగా ఇరుదేశాలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఉగ్రవాదులను , వారికి మద్దుతు ఇస్తున్న వారికి గుణపాఠం తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. సిందు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాక్కు గట్టి షాక్ ఇచ్చారు. ఇండియాలో ఉన్న ఆ దేశ పౌరులు వెళ్లిపోయాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా భారత్తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది.

ఆర్థిక సంక్షోభంతో పాటు ఆకలి కేకలు
అయితే ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో పాటు ఆకలి కేకలతో అలమటిస్తున్న పాక్ పరిస్థితి మరింత దిగజారనుంది. వాణిజ్య సంబంధాల నిలిపివేత పరిణామం పాకిస్తాన్లోని ఔషధ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. తమ దేశంలో ఔషధాల కొరత రాకుండా చూసేందుకు పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు ‘అత్యవసర సన్నద్ధత’ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. ఇప్పటికే సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ కు ఔషద సరఫరా నిలపివేస్తే చావు కేకలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.
భారతదేశంపైనే ఔషధ ఉత్పత్తులు
భారత్ నుండి దిగుమతి.. ప్రస్తుతం, పాకిస్తాన్ తన మొత్తం ఔషధ అవసరాలలో ముఖ్యంగా ముడి పదార్థాలు ( యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ ) అనేక కీలకమైన పూర్తిస్థాయి ఔషధ ఉత్పత్తుల కోసం భారతదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దాదాపు 30 శాతం నుండి 40 శాతం వరకు ముడి పదార్థాలు భారతదేశం నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటితో పాటు, ప్రాణాధారమైన వ్యాక్సిన్లు, ముఖ్యంగా యాంటీ-రేబీస్ వ్యాక్సిన్, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందులు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి కీలకమైన జీవసంబంధ ఉత్పత్తులు కూడా భారతదేశం నుంచే పాకిస్తాన్కు చేరుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంటున్న పాక్
డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ (DRAP) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. నిషేధంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదని, అయితే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆకస్మిక ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. 2019లో తలెత్తిన సంక్షోభం తర్వాతే తాము ఇలాంటి పరిస్థితులకు సన్నద్ధమవడం ప్రారంభించామని, ఇప్పుడు తమ ఔషధ అవసరాలను తీర్చడానికి చైనా, రష్యా, పలు యూరోపియన్ దేశాల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను చురుకుగా అన్వేషిస్తున్నామని ఒక సీనియర్ DRAP అధికారి పేర్కొన్నారు.
యాంటీ-రేబీస్ వ్యాక్సిన్లు, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ చికిత్సలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి ప్రాణాధారమైన వైద్య సామాగ్రి నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఉద్యమశీలిగా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ప్రజలకు కనీస ఆరోగ్య సదుపాయాలు అందించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఔషధాల కొరత వల్ల ప్రాణాలు పణంగా మారవచ్చు. ఈ పరిస్థితి మరింత కఠినంగా మారవచ్చు, మరియు ప్రజల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ తన ఔషధ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. చైనా, రష్యా, యూరోపియన్ దేశాల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను పాకిస్తాన్ అన్వేషిస్తోంది.
Read Also: US peace: ట్రంప్ శాంతి ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందన