📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pak Wagah gate: వాఘా గేట్ మూసివేసిన పాక్..సరిహద్దులో చిక్కుకున్న ప్రజలు..!

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 1:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఇరుదేశాల గగనతలాల్ని ప్రత్యర్థి విమానాలు వెళ్లకుండా ఇప్పటికే మూసేశారు. అలాగే ఇరు దేశాలూ ప్రత్యర్థి దేశాల పౌరుల్ని వారి స్వదేశాలకు బహిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్‌లోని అట్టారీ మీదుగా వాఘా సరిహద్దు పోస్టు వద్ద గేట్లను మూసేశారు.

చిక్కుకుపోయిన ఇరుదేశాల పౌరులు
పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వెళ్లాలనుకునే వారు, అలాగే భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లే వారు ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దుశ్చర్యతో ఇరుదేశాల పౌరులూ ఇక్కడ చిక్కుకుపోయారు. పాకిస్తాన్ జాతీయులను సరిహద్దు దాటడానికి అనుమతించడం లేదని భారత అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆప్ఘన్ ట్రక్కుల్ని మాత్రం భారత్ లోకి వెళ్లందుకు పాకిస్తాన్ అనుమతిస్తోంది.
పెరిగిన ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన
వాస్తవానికి భారత్ లో ఉన్న తమ పౌరుల్ని పాకిస్తాన్ ఏప్రిల్ 29 వరకూ తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో నిన్నటి వరకూ వేచి చూసిన పాకిస్తాన్.. ఇక అట్టారీ-వాఘా గేట్ ను మూసేసింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన మరింత పెరిగినట్లయింది. పాకిస్తాన్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరుదేశాలకు చెందిన పౌరులు ఇక్కడ చిక్కుకుపోయారు.
గడువును పొడిగించిన భారత్
భారత్ తాజాగా పాకిస్తాన్ పౌరుల్ని దేశం విడిచి వెళ్లేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. వివిధ కారణాలతో భారత్ లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ పౌరుల్ని తమ తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ ఇక్కడే ఉండేందుకు అనుమతించింది. దీంతో ఎమర్జెన్సీ కారణాలతో భారత్ లో చిక్కుకున్న వారికి వెసులుబాటు దక్కింది. వీరు కాకుండా మిగిలిన వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోయేందుకు మాత్రం ఇప్పుడు ఆటంకాలు తప్పడం లేదు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌పై యూఎస్ అత్యాశ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan closes Paper Telugu News people trapped at the border! Telugu News online Telugu News Paper Telugu News Today Wagah Gate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.