📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pahalgam Attack: భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేత..పాకిస్తాన్‌కూ నష్టమేనా?

Author Icon By Vanipushpa
Updated: April 26, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వాటిల్లో ఒకటి. దీని వల్ల భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే భారత విమానాలు ఇకపై పాకిస్తాన్ గగనతలం మీదగా ప్రయాణించలేవు. ఈ నిర్ణయం వల్ల గురువారం (ఏప్రిల్ 24) సాయంత్రం ఆరుగంటల తరువాత భారత్‌కు చెందిన ఏ విమానాన్నీ పాకిస్తాన్ గగనతలంపైన ప్రయాణించడానికి అనుమతించలేదు. పాకిస్తాన్ ఈ ప్రకటన చేసే సమయానికి, సహజంగా భారత ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనేక విమానాలు గాల్లో ఉండి, వాటిలో చాలా పాకిస్తాన్ మీదగా ప్రయాణిస్తుంటాయి. అప్పుడేం చేస్తారు? “పాకిస్తాన్ ఈ ప్రకటన చేసిన తర్వాత, మా మొదటి బాధ్యత ఆ సమయానికి గాల్లో ఉన్న విమానాలను భారత్‌కు మళ్లించడం. తర్వాత, తదుపరి వ్యూహం ప్రకారం పనిచేస్తాం” అని భారత విమానయాన సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు.

గతంలోనూ పాకిస్తాన్, భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది. బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసినట్టు భారత్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కొన్ని నెలల పాటు భారత విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసివేసింది. 2019లో ఫిబ్రవరి 27 నుంచి జులై 16 మధ్య, భారత విమానాలు పాకిస్తాన్ గగనతలానికి బదులు ఇతర మార్గాలను ఉపయోగించాల్సి వచ్చింది.
ఖర్చులు పెరుగుతాయా?
గగనతలాన్ని మూసివేయాలనే పాకిస్తాన్ నిర్ణయ ప్రభావం దిల్లీనుంచి ప్రయాణించే విమానాలపై చాలా ఎక్కువగా ఉంటుంది.
అలాగే అమృత్‌సర్, లక్నో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ఇతర విమానాశ్రయాలపైనా ఉంటుంది. దిల్లీ నుంచి మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్, బ్రిటన్, ఉత్తర అమెరికాకు విమానాలు నడిపే భారతీయ కంపెనీలు ఇప్పుడు తమ మార్గాలను మార్చుకోవలసి ఉంటుంది.
“ముంబై నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై ప్రభావం పెద్దగా ఉండదు. కానీ దిల్లీ నుంచి బయలుదేరే విమానాలు పాకిస్తాన్ గగనతలం వెలుపల ప్రయాణించడానికి వీలుగా అహ్మదాబాద్ నుంచి ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకోవలసి ఉంటుంది.
పాకిస్తాన్ కు నష్టమేనా?
విమానాల్లో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్‌) ఉపయోగిస్తారు. ఇండియన్ ఆయిల్ వివరాల ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి అంతర్జాతీయ మార్గాల్లో దిల్లీ నుంచి ప్రయాణించే భారత విమానాలకు ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు (అంటే వెయ్యి లీటర్లు) 794.41డాలర్లు. ముంబై నుంచి ప్రయాణించే విమానాలకు కిలోలీటర్‌కు 794.40డాలర్లుగా ఉంది. విమానం ప్రయాణించాల్సిన దూరం ఎక్కువుంటే కంపెనీలు ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేయడం వల్ల పాకిస్తాన్ కూడా దాదాపు 50 మిలియన్ డాలర్లు నష్టపోయిందని అప్పటి పౌర విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ జూలై 18, 2019న చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని ఉపయోగించినందుకు విమానయాన సంస్థల నుంచి డబ్బు వసూలు చేస్తాయి. దీనిని ఓవర్‌ఫ్లైట్ ఫీ అంటారు.
ఇతర దేశాల మాదిరిగానే, పాకిస్తాన్ కూడా విదేశీ విమానయాన సంస్థల నుంచి చార్జీలు వసూలుచేస్తుంది. వాటిలో భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి.
సుదూర ప్రయాణాలపై ప్రభావమెంత?
భారత్ నుంచి మధ్య ఆసియా, యూరప్, బ్రిటన్, అమెరికా వెళ్లే విమానాలు అరేబియా సముద్రం లేదా మధ్య ఆసియా గుండా ఎక్కువ దూరం ప్రయాణించడానికి బదులుగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంలో ఎక్కువదూరం ప్రయాణించాల్సిరావడం వల్ల విమానయాన సంస్థల నిర్వహణా వ్యయం పెరుగుతుంది. విమానాలు ఎక్కువసేపు ప్రయాణించాల్సిఉంటుంది. దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. మొదటి విషయం ఒక విమానాన్ని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసినప్పుడల్లా, విమానయాన సంస్థ ల్యాండింగ్ చార్జీలను చెల్లించాలి.
రెండో విషయం విదేశాల్లోని విమానాశ్రయంలో దిగాల్సిన సందర్భంలో, ఇంధనం అక్కడి నుంచి కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో ధరల కంటే ఇది చాలా ఎక్కువగా ఉండొచ్చు.
మూడవది, ప్రతి పైలట్ నిర్ణీత సమయం వరకు మాత్రమే విమానాలను నడపగలరు. విమానం నేరుగా ప్రయాణించడానికి బదులుగా మధ్యలో ల్యాండ్ చేయాల్సి వచ్చినప్పుడు, కంపెనీలు అదనపు పైలట్ సేవలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది కూడా ఖర్చును పెంచుతుంది.
ముందుగా భారత్‌లో రిజిస్టర్ అయిన విమానాలకు ఈ పరిమితి వర్తిస్తుందని జితేంద్ర భార్గవ చెప్పారు. ఏదైనా భారత విమానయాన సంస్థ విదేశాలలో విమానాన్ని లీజుకు తీసుకుంటే, దానికి కూడా ఇది వర్తిస్తుంది.
ముంబై నుంచి ప్రయాణించే విమానాలపై పెద్ద ప్రభావం ఉండదు. విదేశీ కంపెనీలు లాభపడతాయా?
దిల్లీ, లక్నో, అమృత్‌సర్ వంటి విమానాశ్రయాల నుంచి బయలుదేరే భారతీయ కంపెనీల విమానాలు ముందు గుజరాత్, మహారాష్ట్ర వైపు వెళ్లాలి.

Read Also: Pahalgam attack: ఖబర్దార్ సింధు నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింప చేస్తాం: పాక్ మాజీ మంత్రి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pakistan closes airspace Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Indian flights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.