📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గూఢచారి సమాచారం చైనా నుంచి వచ్చింది: పాక్

Author Icon By Vanipushpa
Updated: June 27, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan Defence Minister khawaja asif) తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని ఉద్దేశిస్తూ ఖవాజా ఆసిఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోనే తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇలాంటి భాష వాడితే భారత్‌(India)తో చర్చలు ఎలా ముందుకు వెళ్తాయని పాకిస్తాన్‌(Pakistan)కు చెందిన మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఆసిఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో భారత్‌ గురించి చైనా ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకుందని ఆయన అంగీకరించడం తీవ్ర సంచలనంగా మారింది.
తమకు చైనా సహకరించింది: ఖవాజా ఆసిఫ్
ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు చైనా సహకరించిందంటూ ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్.. స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణులు, వైమానిక మార్గాలు, ఆపరేషన్ వంటి అంశాలపై చైనాకు భారత్‌తో సమస్యలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి తెలిపారు.

Pakistan: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత గూఢచారి సమాచారం చైనా నుంచి వచ్చింది: పాక్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత..
భారత్‌తో చైనాకు కూడా ఇబ్బందులు ఉన్నాయని.. పాక్‌తో ఇంటెలిజెన్స్ పంచుకోవడం చాలా సాధారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సర్వసాధారణమేనని ఆయన సమర్థించుకోవడం తీవ్ర విమర్శలకు అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. పాకిస్తాన్ తమ సరిహద్దులను అప్రమత్తంగా ఉంచుకుందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర విమర్శలు
ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని.. అంతర్జాతీయ సమాజానికి బట్టబయలు చేశాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఆయన ఒప్పుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత భారత్ చేసిన దాడుల గురించి పాక్ నేషనల్ అసెంబ్లీలో తప్పుడు ప్రకటనలు చేస్తూ దొరికిపోయిన ఖవాజా ఆసిఫ్.. సొంత దేశ ప్రజల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.

Read Also: India-Us: భారత్‌-అమెరికా బంపర్ వాణిజ్య ఒప్పందం?!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu cross border tensions Google News in Telugu ISI activities Latest News in Telugu Operation Sindoor Pak China intelligence sharing Pakistan allegations India Pakistan army Pakistan China relations Pakistan controversial statements Pakistan defense ministry Pakistan foreign affairs Pakistan India tensions Pakistan intelligence Pakistan military updates Pakistan news Pakistan Politics Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.