విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయుల సమావేశంలో ప్రసంగించిన జనరల్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న వారంత దేశ రాయబారులని.. ఉన్నతమైన భావజాలం.. సంస్కృతికి చెందినవారన్న విషయాన్ని మరిచిపోకూడదని ఆయన అన్నారు. దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాటం చేశారని తెలిపారు. దేశంతో వారి బంధం బలహీనపడకుండా ఉండేందుకు మీ పిల్లలకు పాకిస్థాన్ చరిత్రను తెలియజేయాలన్నారు. హిందువులతో పోలిస్తే.. తాము భిన్నమైన వారని.. తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయని తెలిపారు. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసిందని అసిమ్ మునీర్ అన్నారు.
భారత సైనికులే పాకిస్థాన్ను భయపెట్టలేకపోయారు
ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు. 13 లక్షల భారత సైనికులే పాకిస్థాన్ను భయపెట్టలేకపోయారని.. అలాంటిది ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా వ్యవహరిస్తాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. కాశ్మీరీ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు కోసం పాకిస్థాన్ తన మద్దతును కొనసాగిస్తుందని, ఐక్యరాష్ట్ర సమితి తీర్మానాలకు అనుగుణంగా వారి పోరాటానికి రాజకీయ, దౌత్యపరమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, విదేశాల్లో నివసించే పాకిస్తానీయులతో జరిగిన సమావేశంలో జాతియ భావజాలం, పాక్ చరిత్ర, భారత వ్యత్యాసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “విదేశాల్లో ఉన్న ప్రతీ పాకిస్తానీయుడు దేశానికి రాయబారి వంటివారు.”
“మీ పిల్లలకు పాకిస్తాన్ చరిత్రను తెలియజేయాలి, దేశంతో వారి బంధం బలహీనపడకూడదు.” అని ఆయన అన్నారు.
Read Also: Stock Market: దుమ్ములేపుతున్న స్టాక్ మర్కెట్.. 1500 పెరిగిన సెన్సెక్స్..