📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pak Pilot: భారత్ సైన్యం కస్టడీలో పాకిస్థాన్‌ పైలట్‌

Author Icon By Vanipushpa
Updated: May 9, 2025 • 11:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పఠాన్‌కోట్‌ సెక్టార్‌ (Pathankot Sector)లో పాకిస్థాన్‌కు చెందిన రెండు ఫైటర్‌ జెట్ల (Fighter Jets)ను భారత సైన్యం కూల్చి వేసింది. ఇందులో ఎఫ్‌-16 (F-16)యుద్ధ విమానం కూడా ఉంది. అంతేకాదు ఈ ఎఫ్‌-16 పైలట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. జలంధర్‌(Jalandhar)లో పాక్‌ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది.
పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్​పై దాడికి పాక్​ యత్నం
ఆపరేషన్ సిందూర్ తరువాత పాక్, భారత సరిహద్దు రాష్ట్రాల్లోని​ జనావాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అంతేకాదు పోఖ్రాన్‌ ఆర్మీ స్టేషన్‌పై దాడికి యత్నించింది. మిసైళ్లు, డ్రోన్​లను ప్రయోగించింది. మొత్తంగా చూసుకుంటే హమాస్​ తరహా దాడులకు పాక్ విఫలయత్నం చేసింది. అయితే పాక్ దాడులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంది. పాక్​కు చెందిన 8 మిసైళ్లను, డ్రోన్​లను, 2 ఫైటర్ జెట్​లను కూల్చేసింది. అంతేకాదు పాకిస్థాన్​లోని సర్గోధా, ఫైసలాబాద్​లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా భారత వాయుసేన కూల్చేసింది.

Pak Pilot: భారత్ సైన్యం కస్టడీలో పాకిస్థాన్‌ పైలట్‌ర్ట్

పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న మోదీ
పాకిస్థాన్ దాడులు చేపట్టిన నేపథ్యంలో, జరుగుతున్న పరిణామాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. మరోవైపు త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ కూడా సీడీఎస్​, త్రివిధ దళాధిపతులతో పరిస్థితులను సమీక్షించారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
పాక్ ఉగ్రవాదుల తరహాలో దాడులు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని విమానయాన శాఖ సూచించింది. విమానాశ్రయ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని నిర్దేశించింది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్​, రాజస్థాన్​, పంజాబ్​ల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని సూచించింది.
జమ్మూకశ్మీర్‌ లక్ష్యంగా పాక్ దాడులు
జమ్మూకశ్మీర్‌ లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది. ముఖ్యంగా జమ్మూలోని విమాశ్రయమే లక్ష్యంగా డ్రోన్​లను ప్రయోగించింది. భిష్ణా, ఆర్​ఎస్​ పురా, సాంబా, పూంచ్​, కథువా ప్రాంతాల్లో షెల్లింగ్ దాడులు చేసింది. అయితే ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా అఖ్నూర్‌, కిష్త్వార్‌, సాంబా, ఉధంపూర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు చేసింది. రాజస్థాన్​లోని జైసల్మీర్​లో పాక్​ డ్రోన్ దాడులు చేయగా, వాటనిని భారత సైన్యం కూల్చేసింది. మరోవైపు రాజస్థాన్​లోని జైసల్మీర్​, బికనేర్​ సహా పలుప్రాంతాల్లో బ్లాక్​అవుట్ ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్​సర్​, జలంధర్​, పఠాన్​కోట్​ సహా పలు ప్రాంతాల్లో (బ్లాక్‌అవుట్‌) విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాక్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు పారామిలటరీ బలగాలను పంజాబ్​కు తరలిస్తున్నారు.

Read Also: India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్ధం: తాజా పరిణామాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in custody Indian Army Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News"of Indian Army

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.