📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan Cyber Attack: పహల్గామ్ దాడి, అభినందన్ వర్ధమాన్‌పై రెచ్చగొట్టే పోస్టులు

Author Icon By Vanipushpa
Updated: April 29, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన కీలకమైన విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెబ్‌సైట్ హోమ్‌పేజీని హ్యాకర్లు పూర్తిగా మార్చేశారు. ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్’ పేరుతో ఈ దాడికి పాల్పడినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను తెరిచిన వెంటనే రెచ్చగొట్టే సందేశాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
హ్యాక్ అయిన వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “ఫెంటాస్టిక్ టీ క్లబ్ పాకిస్థాన్ సైబర్ ఫోర్స్” అనే శీర్షికతో పాటు, పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు ఉంచారు. “పహల్గామ్ దాడి కాదు… అది అంతర్గత కుట్ర… నిప్పు రాజేసింది మీరే, ఇప్పుడు పర్యవసానాలకు సిద్ధంగా ఉండండి” వంటి సందేశాలను పోస్ట్ చేశారు. అంతేకాదు, ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి భార్యను ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే ఆమెను రంగంలోకి దించారని పాకిస్థాన్ హ్యాకర్లు ఆరోపించారు.

ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు
అంతేకాకుండా, 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉదంతాన్ని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అభినందన్ టీ తాగుతూ పాక్ అధికారులతో మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ హ్యాకర్లు ఈ పోస్టులు పెట్టారు.
మంగళవారం ఉదయం ఈ సైబర్ దాడి వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. “వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశాం. ఐటీ విభాగం పునరుద్ధరణ పనులను వేగంగా చేపడుతోంది. ఈ ఘటనపై సైబర్ భద్రతా ఏజెన్సీలకు కూడా సమాచారం అందించాం. ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించడానికి, డేటాకు ఏదైనా నష్టం జరిగిందా అని అంచనా వేయడానికి దర్యాప్తు ప్రారంభించాం,” అని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు.
Read Also: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి వెలుగులోకి సంచలన నిజాలు!

#telugu News Abhinandan Varthaman Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pahalgam Attack Paper Telugu News provocative posts against Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.