हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రస్థావరాలు.. మళ్లీ నిర్మాణ యత్నాలు

Vanipushpa
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన  ఉగ్రస్థావరాలు.. మళ్లీ నిర్మాణ యత్నాలు

పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) విజయవంతమైన సంగతి తెలిసిందే. పాక్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద శిబిరాలను.. భారత దళాలు ధ్వంసం చేశాయి. దీంతో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడుల్లో పాక్(Pak) గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలు, ట్రైనింగ్ క్యాంపులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు.. పాక్‌లోని ఉగ్రసంస్థలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. కీలక నేతలు కూడా హతమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ సిందూర్ ముగిసి 3 నెలలు గడిచింది. దీంతో ధ్వంసమైన శిబిరాలు, స్థావరాలను మళ్లీ నిర్మించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు పావులు కదుపుతున్నాయి. అందుకోసం నిధులు సేకరించే పనిలో పడ్డాయి.

Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన  ఉగ్రస్థావరాలు.. మళ్లీ నిర్మాణ యత్నాలు
Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రస్థావరాలు.. మళ్లీ నిర్మాణ యత్నాలు

విరాళాలను సేకరించే పనిలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ
భారత్‌లో కీలక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు.. ఆపరేషన్ సిందూర్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసింది. పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌ను భారత వైమానిక దళం.. ధ్వంసం చేసింది. దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 100 కిలోమీటర్ల లోపల ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయాన్ని భారత్ నామరూపాల్లేకుండా చేసింది. మన దేశంలో 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి సహా అనేక ఉగ్రదాడుల వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది.
ఆపరేషన్ సిందూర్ జరిగిన దాదాపు 3 నెలల తర్వాత.. మౌలానా మసూద్ అజహర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ తన హెడ్ క్వార్టర్స్‌ను పునర్నిర్మించుకునేందుకు విరాళాలను సేకరించే పనిలో పడింది. 2015లో నిర్మించిన ఈ హెడ్ క్వార్టర్స్‌ను యువకులను ఉగ్రసంస్థల్లోకి రిక్రూట్‌ చేసుకోవడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపయోగించేవారు. ఈ విరాళాలకు సంబంధించి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సోషల్ మీడియాలో ఉర్దూలో ఒక పోస్ట్ చేసింది.
జైషే మహ్మద్ ఉగ్రస్థావరం లక్ష్యంగా భారత్ చేసిన దాడులు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరం లక్ష్యంగా భారత్ చేసిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లిందని మక్సర్ శాటిలైట్ చిత్రాలు (Maxar Satellite Images) కూడా వెల్లడించింది. భారత్ చేసిన ఆ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది సభ్యులతోపాటు మరో నలుగురు సహాయకులు చనిపోయినట్లు స్వయంగా ఆయనే పేర్కొన్నాడు. తన అక్క, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలుతోపాటు ఐదుగురు పిల్లలు చనిపోయినట్లు మసూద్ అజహర్ తెలిపాడు.ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

నేపథ్యం

జైష్-ఎ-మొహమ్మద్ (JEM) – దీనిని ఆర్మీ ఆఫ్ మొహమ్మద్, ఖుదాముల్ ఇస్లాం మరియు తెహ్రిక్ ఉల్-ఫుర్ఖాన్ అని కూడా పిలుస్తారు – ఇది పాకిస్తాన్‌లో ఉన్న ఒక తీవ్రవాద సంస్థ. భారతదేశంలోని జైలు నుండి విడుదలైన తర్వాత 2000 ప్రారంభంలో మసూద్ అజార్ దీనిని స్థాపించాడు. కాశ్మీర్‌ను పాకిస్తాన్‌తో ఏకం చేయడం మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి విదేశీ దళాలను బహిష్కరించడం ఈ గ్రూప్ లక్ష్యం

2000లో ప్రారంభమైనప్పటి నుండి..

ఈ బృందం భారతదేశంలోని పౌర, ఆర్థిక మరియు సైనిక లక్ష్యాలపై అనేక తీవ్రవాద దాడులను నిర్వహించింది. ఇది కాశ్మీర్‌ను మొత్తం భారతదేశానికి “గేట్‌వే”గా చిత్రీకరిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/virat-kohli-virat-kohli-is-a-good-singer-dhoni/sports/527387/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

📢 For Advertisement Booking: 98481 12870