📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: మ‌ద‌ర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనికులు ధైర్యం, పరాక్రమాన్ని చూపుతూ ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) చేపట్టారు. పాక్, పీఓకే(Pak POK) లోని ఉగ్రస్థావరాలే టార్గెట్​గా దాడులు జరిపి వందకుపైగా ముష్కరులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైనికులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయ్యిందని భారత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) విజయాన్ని పిల్లలకు వివరంగా తెలియజేప్పేందుకు రాజస్థాన్ మదర్సా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఆధ్వర్యంలో నడుస్తున్న మదర్సాల్లో ‘ఆపరేషన్ సిందూర్’ను సిలబస్​లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మదర్సా బోర్డు ఛైర్మన్ చోప్‌ దార్ వెల్లడించారు.
సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతులు
రాజస్థాన్ మదర్సా బోర్డు నిర్వహిస్తున్న మదర్సాలలో ‘ఆపరేషన్ సిందూర్‌’ను సిలబస్ లో చేర్చాలని భావిస్తున్నట్లు చోప్ దార్ వెల్లడించారు. అందుకోసం సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను సైనిక కుటుంబం నుంచి వచ్చానని, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దళాలు చూపిన ధైర్యాన్ని మదర్సాల పిల్లలకు కూడా నేర్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Rajasthan: మ‌ద‌ర్సాలో ‘ఆపరేషన్ సిందూర్’ పాఠ్యాంశం

కర్నల్ సోఫియా ముస్లిం పిల్లలకు ప్రేరణ
“ఆపరేషన్ సిందూర్ గురించి కర్నల్ సోఫియా ఖురేషీ బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు, అందరూ ఆమెను చూసి గర్వపడ్డారు. మేము ఆపరేషన్ సిందూర్, కర్నల్ సోఫియా గురించి వీలైనంత ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులకు బోధిస్తాం. అందుకోసం మేము సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో మాట్లాడుతాం. ఆపరేషన్ సిందూర్ ను సిలబస్‌ లో చేర్చాలని కోరుతాం. ఆతర్వాత పిల్లలకు దీని గురించి తెలియజేస్తాం. కర్నల్ సోఫియా ముస్లిం సమాజానికి చెందిన మహిళ. ఆమె ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. ఆమె ముస్లిం పిల్లలకు ప్రేరణగా నిలుస్తారు చోప్ దార్, మదర్సా బోర్డు ఛైర్మన్ చెప్పారు.

Read Also: Schengen Visa: ఇండియన్స్ కి షెంజెన్ వీసాల తిరస్కరణ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu curriculum in madrasa Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.