📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పహల్గామ్ దాడి ఉగ్రవాదికి బహిరంగ మద్దతు

Author Icon By Vanipushpa
Updated: June 3, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న అవినాబావ సంబంధాలు బట్టబయలవుతున్నాయి. తాజాగా, పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్సుల అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్… అమెరికా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాది, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి. లష్కరే తొయీబా (LeT) ఉపాధ్యక్షుడు సైఫుల్లాహ్ కాసౌరి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ర్యాలీలో అతడితో పాటు లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ (Hafiz Saeed) కుమారుడు తల్హా సయీద్ కూడా పాల్గొనడం గమనార్హం.

Pakistan: పహల్గామ్ దాడి ఉగ్రవాదికి బహిరంగ మద్దతు

పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫుల్లాహ్ కాసౌరిని అనుమానితుడిగా చూడకూడదని, విచారణ పూర్తికాని వరకు అతడు అనుమానించకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను కూడా కాసౌరి ప్రాంతానికి చెందినవాడ్నే అని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు.

1971 ఓటమికి ప్రతీకారంగా విజయం
1971 యుద్ధంలో భారత్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంలో తాము విజయం సాధించామని పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో కాసౌరీ, తల్హా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం మే 28న ఈ ర్యాలీని గుజ్రన్‌వాలాలో లష్కరే తొయిబా రాజకీయ విభాగం నిర్వహించింది.
అలాగే, ర్యాలీలో లష్కరే నేతలు మాట్లాడుతూ.. గతేడాది బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసినాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో తమ పాత్రను ఘనంగా చెప్పుకున్నారు.

Read Also: Florida Teacher: మైనర్ విద్యార్ధితో టీచర్ తరగతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu for Pahalgam attack Google News in Telugu Latest News in Telugu Open support Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today terrorist

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.