సిరియా(Syria)లోని స్వెయిదా రాష్ట్రంలో స్థానిక మిలీషియాల(Milishiah) మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఇద్దరు పిల్లలుసహా 30 మందికి పైగా మరణించారు. 100 మంది వరకూ గాయపడ్డారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. మైనారిటీ షియా(Shia) తెగకు చెందిన ద్రూజ్ మిలీషియాకు, సున్నీ బెడ్విన్ తెగలకు మధ్య తొలుత సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణను అదుపు చేసేందుకు ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగడంతో వాటిపై ఇజ్రాయెల్ దాడికి పూనుకుంది. ద్రూజ్ మిలీషియాకు మద్దతుగా తాము సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘర్షణలో మృతుల సంఖ్య 50కిపైనే ఉంటుందని బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది.

సాయుధ తిరుగుబాటు
2011లో “అరబ్ స్ప్రింగ్” ప్రజాస్వామ్య ఉద్యమాలు మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టాయి. సిరియాలో కూడా అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు. అయితే, అస్సాద్ ప్రభుత్వం ఈ నిరసనలను క్రూరంగా అణచివేయడంతో, అవి సాయుధ తిరుగుబాటుగా మారాయి.
అస్సాద్ కుటుంబం ఐదు దశాబ్దాలకు పైగా సిరియాను పాలించింది. తండ్రి హఫీజ్ అల్-అస్సాద్ తర్వాత కుమారుడు బషర్ అల్-అస్సాద్ అధికారంలోకి వచ్చారు. వీరి పాలనలో ప్రజలకు కనీస స్వాతంత్ర్యం, మానవ హక్కులు నిరాకరించబడ్డాయి.
ఆర్థిక సంక్షోభం
యుద్ధానికి ముందు కూడా సిరియా ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉంది. యుద్ధం ప్రారంభమయ్యాక అది మరింత దిగజారింది. నిరుద్యోగం పెరిగింది, వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. సిరియాలో సున్నీ ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా, అస్సాద్ కుటుంబం షియా ఇస్లాంలో భాగమైన అలవైట్ వర్గానికి చెందింది. ఈ మతపరమైన విభేదాలు కూడా యుద్ధానికి ఆజ్యం పోశాయి. సిరియా అంతర్యుద్ధం క్రమంగా అంతర్జాతీయ సమస్యగా మారింది. వివిధ దేశాలు తమ ప్రయోజనాల కోసం ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్నాయి.
టర్కీ, పశ్చిమ దేశాల మద్దతు
రష్యా మరియు ఇరాన్ అస్సాద్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చాయి. రష్యా వైమానిక దాడులతో అస్సాద్ బలగాలకు అండగా నిలిచింది. తిరుగుబాటు దళాలకు టర్కీ, అమెరికా మరియు కొన్ని పశ్చిమ దేశాలు మద్దతు ఇచ్చాయి. టర్కీ ముఖ్యంగా హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) వంటి తిరుగుబాటు గ్రూపులకు ఆయుధాలు, సైన్యాన్ని అందించింది. ఉగ్రవాద సంస్థల ఆవిర్భావం: యుద్ధం మధ్య ఇస్లామిక్ స్టేట్ (ISIS) వంటి ఉగ్రవాద సంస్థలు సిరియాలో పురుడు పోసుకుని, దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి.
లక్షలాది మంది ప్రజలు మృతి
మానవతా సంక్షోభం: మరణించారు, కోట్లాది మంది తమ నివాసాలను విడిచి శరణార్థులుగా మారారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా ఇది నిలిచింది.
సిరియా ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. 90 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. విద్యుత్, ఆహారం, మందులు వంటి కనీస అవసరాలు కూడా లభించడం లేదు. మౌలిక సదుపాయాల విధ్వంసం: నగరాలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దేశాన్ని పునర్నిర్మించడానికి వందల బిలియన్ల డాలర్లు అవసరమని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది .
Read hindi news: hindi.vaartha.com
Read Also: Saina Nehwal: వివాహ బంధానికి సైనా-కశ్యప్ గుడ్ బై