చైనా(China)లో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేందుకు అక్కడి ప్రభుత్వం తన ప్రయత్నాలను గణనీయంగా వేగవంతం చేసింది. ఈ క్రమంలో, ప్రభుత్వ అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని బీజింగ్(Beijing) ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా అధికారుల ప్రయాణాలు, మద్యం(Wine) వినియోగం, సిగరెట్లు(Cigarette) వంటి ఖర్చులను తగ్గించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. ఈ విషయాలను అక్కడి ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు నివేదించాయి.
ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి
దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా, అధ్యక్షుడు షీ జిన్పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ అధికారులతో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలకు కూడ సుదీర్ఘ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రయాణాలు, మద్యం, సిగరెట్లు, భోజనం మరియు కార్యాలయాల అద్దెలపై వచ్చే వ్యయాలను తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ వనరుల వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
అధిక ఖర్చులను దుబారా చర్యలుగా..
అధిక ఖర్చులను దుబారా చర్యలుగా పేర్కొంటూ, అలాంటి వ్యవహారాలు “సిగ్గుచేటు”గా పరిగణించాలంటూ స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం. ఇటీవలి కాలంలో, స్థిరాస్తి విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చైనా ప్రభుత్వం తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో, స్థానిక ప్రభుత్వాలపై అప్పుల భారం కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఖర్చుల ద్వారా ఆర్థిక ఒత్తిడి మరింత పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చే దిశగా ముందుకెళ్తూ, అధికారులను ఖర్చుల తగ్గింపుపై కేంద్రీకరించమని స్పష్టం చేసింది.
Read Also: ndia-Pakistan: భారత్,పాక్ ఘర్షణల్లో చైనా ఆయుధాల ఉపయోగం