వైట్ హౌస్లో ట్రంప్-నెతన్యాహు సమావేశం, శాంతికి కృషి చేసినందుకే అభినందన
వైట్ హౌస్లో కీలక భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) మధ్య అమెరికాలోని వైట్ హౌస్(White House)లో సమావేశం జరిగింది. భేటీ అనంతరం వారు కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంలో నెతన్యాహు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నోబెల్కు అధికారిక సిఫారసు
నెతన్యాహు, ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ లేఖను స్వయంగా అందజేశారు. ట్రంప్ శాంతి స్థాపన కోసం చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఆయనకు ఈ గౌరవం లభించాలని కోరారు.
“శాంతికి ట్రంప్ కృషి చేశారనీ, ఆయనకు నోబెల్ బహుమతి రావాలి,” అంటూ నెతన్యాహు తెలిపారు.

అసిమ్ మునీర్ మద్దతు కూడా
ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెతన్యాహు మద్దతుతో ట్రంప్ నోబెల్ రేసులో మరింత ముందుకు వెళ్లినట్లయ్యింది.
గాజా పరిస్థితిపై చర్చలు
నెతన్యాహు అమెరికాలో తన పర్యటనలో గాజాలో జరుగుతున్న కాల్పులు, ఇజ్రాయెల్ ఆర్మీ చర్యలు, మరియు బందీల విడుదల అంశాలపై ట్రంప్తో చర్చించారు.
గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేయించేందుకు సహకారం కోరినట్లు తెలుస్తోంది.
వేరువేరు సమావేశాలు
ట్రంప్తో పాటు, నెతన్యాహు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశాలు కూడా గాజా యుద్ధ పరిణామాలు, మానవహక్కుల అంశాలపైనా జరిగినట్లు సమాచారం .
డొనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల కోసం తన అభ్యర్థిత్వాన్ని 2015 జూన్ 14న న్యూయార్క్ సిటీలోని ట్రంప్ టవర్ వద్ద అధికారికంగా ప్రకటించారు.
డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ చదువుకున్నారు?
డోనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మిలిటరీ అకాడమీ (1959–64), ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్; బ్రోంక్స్లోని ఫోర్డ్హామ్ విశ్వవిద్యాలయం (1964–66); మరియు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం యొక్క వార్టన్ స్కూల్ (1966–68) లలో చదివారు.
Read Also:hindi.vaartha.com
Read Also:Brics: ట్రంప్ షాక్: బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు