📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌

Author Icon By Anusha
Updated: June 28, 2025 • 9:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత జావెలిన్ త్రో దిగ్గజం, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఇటీవల అంతర్జాతీయ క్రీడా వేదికలపై వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తున్న నీరజ్, ఇప్పుడు పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఇది భారత క్రీడాకారుల గర్వకారణంగా నిలిచింది.ఈ క్రమంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్‌ (Anderson Peters) ను వెనక్కి నెట్టాడు.ఈ వారం వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా 1,445 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.రెండో స్థానంలో ఉన్న అండర్సన్ పీటర్స్ 1,431 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్

ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 91.06 మీటర్ల రికార్డు త్రో విసిరిన జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మూడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో నాలుగో స్థానంలో, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్ (చెక్ రిపబ్లిక్) ఐదో స్థానంలో ఉన్నాడు. గతేడాది సెప్టెంబర్ 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) తర్వాత నీరజ్ తన నంబర్ వ‌న్‌ ర్యాంకును కోల్పోయిన విష‌యం తెలిసిందే. దాంతో పీటర్స్ అగ్ర‌స్థానాన్ని అధిరోహించాడు. ఆ ఒలింపిక్స్‌లో నీరజ్ 89.45 మీటర్ల త్రోతో రజతం గెలవగా, పీటర్స్ కాంస్య పతకం సాధించాడు. అయితే, 2025లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి వచ్చాడు. ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన పోచ్ ఇన్విటేషనల్ టోర్నీ (Invitational Tournament) లో విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించాడు. ఆ తర్వాత దోహా డైమండ్ లీగ్‌లో తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును దాటి, 90.23 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

Neeraj Chopra

ప్రధాన టోర్నమెంట్ల ఫైనల్స్‌లో పీటర్స్‌పై

అదే నెలలో పోలాండ్‌లో జరిగిన జానస్ కుసోసిన్‌స్కీ మెమోరియల్ టోర్నీలోనూ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ నెలలో పారిస్ డైమండ్ లీగ్ (88.16 మీటర్లు), ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ (85.29 మీటర్లు) టోర్నీలలో వరుసగా స్వర్ణాలు గెలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పీటర్స్‌తో తలపడిన నాలుగు పోటీల్లోనూ నీరజ్ చోప్రా (Neeraj Chopra) నే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా ప్రధాన టోర్నమెంట్ల ఫైనల్స్‌లో పీటర్స్‌పై నీరజ్ 16-5 తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక‌, ఈ ఇద్దరు స్టార్ అథ్లెట్లు జూలై 5న బెంగళూరులో జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్‌లో మరోసారి తలపడనున్నారు. దీంతో వీరి మధ్య పోటీపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Read Also: Shikhar Dhawan: ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడన్న శిఖర్ ధావన్

#JavelinKing #NeerajChopra #OlympicChampion #WorldNo1 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.