📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Bilawal Bhutto: అమెరికాలో బిలావల్ భుట్టో పర్యటనపై ఎంపీ తేజస్వీ సూర్య ఎద్దేవా

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ నేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో(Bilawal Bhutto) అమెరికా(America) పర్యటనలో శాంతి గురించి మాట్లాడటంపై బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య(Tejaswi Surya) తీవ్రంగా స్పందించారు. బిలావల్ నోటి నుండి శాంతి వచనాలు వినస్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

తేజస్వీ సూర్య మాట్లాడుతూ..
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్వీ సూర్య మాట్లాడుతూ, “భుట్టో తనను తాను శాంతి ప్రతినిధిగా అభివర్ణించుకుంటున్నారు. అంతేకాకుండా, శాంతి గురించి మాట్లాడుతున్నారు. ఇది చూడటానికి దెయ్యాలు వేదాలు చదివినట్లుగా ఉంది” అని ఎద్దేవా చేశారు.

Bilawal Bhutto: అమెరికాలో బిలావల్ భుట్టో పర్యటనపై ఎంపీ తేజస్వీ సూర్య ఎద్దేవా


చౌకబారు ఆయుధాలతో పాకిస్థాన్ కాలం
పాకిస్థాన్ నకిలీ హీరోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని, యుద్ధంలో విఫలమైన వారికి ఫీల్డ్ మార్షల్స్‌గా పదోన్నతులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. “వారికి అసలైన హీరోలు ఎలా ఉంటారో తెలియదు. చైనాకు చెందిన చౌకబారు ఆయుధాలతో పాకిస్థాన్ కాలం గడుపుతోంది. కాబట్టి, మా దేశంలోని అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మా బలగాలను, మా బలమైన ప్రజాస్వామ్య నాయకత్వాన్ని వారు జీర్ణించుకోవడం కష్టమే” అని తేజస్వీ సూర్య అన్నారు.
బిలావల్ భుట్టో ఏమన్నారంటే…
ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలోనే పాకిస్థాన్ కూడా తన మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సారథ్యంలో ఓ ఎంపీల బృందాన్ని అమెరికాకు పంపింది. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో బిలావల్ భుట్టో ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన నిఘా సంస్థలు పరస్పరం సహకరించుకుంటే ఉగ్రవాద ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అణ్వస్త్ర దేశాలైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధం మళ్లీ తలెత్తే అవకాశాలు పెరిగాయే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ నదీ జలాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని బిలావల్ ఆరోపించారు.

Read Also: Odisha: కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu MP Tejashwi Surya on Bilawal Bhutto's Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today visit to America

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.