పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ను విజయవంతంగా ముగించిన భారత్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యూహాలపై ఫోకస్ పెంచుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్ని ఏకం చేసేందుకు అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ పై స్వల్పకాలిక యుద్ధం తాము చేయడం కంటే ప్రపంచ దేశాల నుంచి ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ (Modi)కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అంతరించేందుకు భారత్ గ్లోబల్ లెవెల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నం ప్రారంభించింది. ఈ కొత్త ఆపరేషన్ ద్వారా కూటమిల రాజకీయాన్ని వినియోగించు కుంటూ, పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ఆయా బృందాలు భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తాయి. పాకిస్థాన్పై ఉన్న అంతర్జాతీయ మద్దతును తగ్గించాలన్నది ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.

అఖిలపక్ష ప్రతినిధి బృందాల ఏర్పాటు
ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటించి ఉగ్రవాద వ్యతిరేక సందేశం వినిపించేందుకు వీలుగా ప్రధాని మోడీ (Modi) ఏడుగురు ఎంపీల నేతృత్వంలో వేర్వేరు అఖిలపక్ష బృందాల్ని ఏర్పాటు చేశారు. ఏడుగురు ఎంపీల నేతృత్వంలోని అఖిలపక్ష బృందాలు త్వరలో ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటిస్తాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. శశిథరూర్ నేతృత్వంలో అఖిల పక్ష బృందం అమెరికాకు వెళ్లనుంది. తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్లేలా కేంద్రం షెడ్యూల్ చేసింది. ఆయా దేశాల్లో వీరు రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది.
Read Also: Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు