📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: సుంకాలు తగ్గించేందుకు మోదీ సర్కార్‌ సిద్ధం!

Author Icon By Vanipushpa
Updated: March 26, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది! అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధించిన ఏప్రిల్‌ 2 గడువు సమీపిస్తుండడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికా దిగుమతులలో సగానికి పైగా వస్తువులపై సుంకాన్ని తగ్గించాలని యోచిస్తోంది. అమెరికా దిగుమతులలో సగం అంటే దాదాపు రూ.1.97 లక్షల కోట్ల (23 బిలియన్‌ డాలర్లు) విలువైన దిగుమతి సుంకాలపై కోత విధించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికాకు జరిగే రూ.5.65 లక్షల డాలర్ల (66 బిలియన్‌ డాలర్లు) ఎగుమతులను రక్షించుకోవాలని ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల హెచ్చరిక దాని మిత్రదేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు 87 శాతం భారతీయ ఎగుమతులపై ప్రభావితం చూపుతాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 55 శాతం అమెరికా దిగుమతులపై సుంకం తగ్గించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్‌ 5 శాతం నుంచి 30 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. కొన్ని సుంకాలను తగ్గించి, మరి కొన్నిటిపై పూర్తిగా సుంకాలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలు తగ్గించే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతున్నాయి.

ఏ వస్తువులపై సుంకాల కోత?
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో సగం వస్తువులపై సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఆల్మండ్లు, ఓట్‌మీల్‌, పిస్తాపప్పు, క్వినోవా ఉండనున్నాయి. అయితే మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించబోమని భారత్‌ ఇదివరకే స్పష్టం చేసింది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Modi government is ready Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.