📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Terrorist: కుక్క చావు చచ్చిన జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది

Author Icon By Vanipushpa
Updated: June 4, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Terrorist: భారత్ ను నాశనం చేస్తా.. ధ్వంసం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజిజ్ ఎసార్ (Maulana abdul aziz) పాకిస్థాన్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

పాకిస్థాన్(Pakistan) లోని సింధ్(Sindu) జిల్లాలో ఈ ఘటన జరిగింది. అజిజ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అజిజ్ మృతికి సంబంధించిన వార్త పలు అంతర్జాతీయ ఛానెళ్లలో ప్రసారం అవుతోంది.
దాడుల్లో అజిజ్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడి
జైషే ఏ మహమ్మద్ కీలక ఉగ్రవాది మౌలానా అజిజ్ ఎసార్ పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో మృతి చెందాడు. అనుమానాస్పద రీతిలో అజిజ్ హతం అయ్యాడు. భారత్ లో ఉగ్రమూకలు జరిపిన అనేక దాడుల్లో అజిజ్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం అజిజ్ జూన్ 2న మృతి చెందాడు.

Terrorist: కుక్క చావు చచ్చిన జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది

అజిజ్ స్వస్థలం అష్రఫ్ వాలా గ్రామం, కల్లూర్ కోట్, భక్కర్ జిల్లా. జైషే ఏ మహమ్మద్ సంస్థ ప్రకారం అతడు హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడట.

కానీ ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు తెలుస్తోంది.

అయితే అధికారిక వర్గాల ప్రకారం ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సామాజిక మాధ్యమాల్లో అజిజ్ వ్యాఖ్యలు వైరల్

అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో అజిజ్ కు సంబంధించి కీలకమైన ఉగ్రస్థావరం కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.

ఈ క్రమంలో భారత్ ను బెదిరిస్తూ అజిజ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆయన హతం కావడం గమనార్హం.

భారత్ ను ముక్కలు ముక్కులుగా చేస్తానంటూ అజిజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ పై బాంబుల దాడి చేస్తామని హెచ్చరించాడు.

భారత్ ను ముక్కలు చేస్తానని. కుక్క చావు చచ్చాడు అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఉగ్రవాదులను ఏరి పారేయడంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం వల్లనే ఉగ్రవాదులు హతం అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Yahya Sinwar : సిన్వర్ స్థానంలో హమాస్ కు కొత్త

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Key Jaish-e-Mohammed terrorist Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.