हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!

Shobha Rani
Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!

బంగ్లాదేశ్‌లోని 18వ శతాబ్దానికి చెందిన కాంటాజీ దేవాలయం(Kantaji Temple), ఇటీవల విడుదలైన కొత్త 20 టాకా నోటుపై ముద్రించబడింది. ఈ నిర్ణయం చారిత్రకంగా, మతపరంగా, మరియు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనడానికి సంకేతంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ జాతిపిత, అవామీ లీగ్ సహ వ్యవస్థాపకుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ వారసత్వం, జ్ఞాపకాల నుంచి దేశాన్ని దూరం జరిపే ప్రయత్నాల్లో భాగంగా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రపటాన్ని తొలగిస్తోంది. దీని స్థానంలో చారిత్రక కట్టడాలు, మతపరమైన ప్రదేశాల చిత్రాలను ముద్రిస్తున్నారు. ఈ క్రమంలో, వివాదాలు, ఉగ్రదాడులను ఎదుర్కొన్న 18వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం చిత్రం ఇప్పుడు బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 1న బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ అయిన ‘బంగ్లా బ్యాంక్’ కొత్త 20 టాకా నోటును విడుదల చేసింది. ఈ నోటుకు ఒకవైపు దిన్‌జ్‌పూర్‌లోని చారిత్రక కాంటాజీ హిందూ ఆలయ చిత్రాన్ని ముద్రించారు. మరోవైపు, నవగావ్ జిల్లాలోని పహార్‌పూర్ బౌద్ధారామం చిత్రం ఉంది. ఈ బౌద్ధారామం 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బంగ్లాదేశ్ జాతీయ పుష్పమైన కలువ పువ్వు (ఆకు, మొగ్గతో సహా)ను ముద్రించారు.

 Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!
Kantaji Temple: బంగ్లాదేశ్ కరెన్సీ నోటుపై కాంటాజీ దేవాలయం!

కరెన్సీ నోటుపై ముద్రణ
కొత్త 20 టాకా నోటుపై స్థానం సంపాదించుకున్న కాంటాజీ ఆలయాన్ని కాంటాజీ టెంపుల్ లేదా కాంటానగర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి రూపమైన కాంటాజీ పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చిందని యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ (యుఎన్‌బి) నివేదిక పేర్కొంది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు, ఆయన దేవేరి రుక్మిణికి అంకితం చేసినట్టు చెబుతారు. దిన్‌జ్‌పూర్ మహారాజా ప్రాణ్‌నాథ్ 1704లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన కుమారుడు మహారాజా రామ్‌నాథ్ 1752లో పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన అవిభక్త బెంగాల్ ప్రాంతంలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కాంటాజీ ఆలయం గతంలో తీవ్రవాదుల దాడికి గురైంది. డిసెంబర్ 2015లో రాస్ మేళా ఉత్సవాల సమయంలో న్యూ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదులు మూడు బాంబులు విసిరారని 2017 నాటి ఢాకా ట్రిబ్యూన్ కథనం వెల్లడించింది. ఈ జేఎంబీ సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థగా పనిచేస్తూ, భారత్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో నిషేధానికి గురైంది. దాడి తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అయితే, ఈ దాడికి మాత్రం జేఎంబీ బాధ్యత వహించలేదు. ఇదిలా ఉండగా, మార్చి 2024లో (అప్పటి హసీనా ప్రభుత్వ హయాంలో) కాంటాజీ ఆలయ స్థలంలో ఒక మసీదు నిర్మాణ పనులు ప్రారంభం కావడం స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దిన్‌జ్‌పూర్-1 నియోజకవర్గ ఎంపీ ఎండి జకారియా జకా ఈ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే, గతేడాది సెప్టెంబర్‌లో యూనస్ ప్రభుత్వ మత వ్యవహారాల సలహాదారు ఏఎఫ్ఎం ఖలీద్ హొస్సేన్ ఈ వివాదంపై స్పందిస్తూ “మసీదు పక్కన ప్రభుత్వ భూమి ఉంది. ఆ లీజు భూమిలో మసీదు విస్తరణ జరగనివ్వండి. ఆలయ ఆస్తి ఆలయానికే ఉండాలి” అని వ్యాఖ్యానించారు. కరెన్సీ నోటుపై ఈ ఆలయ చిత్రాన్ని ముద్రించడం, దేశంలో మతపరమైన సమరసతపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. అంతకుముందు, 2002లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాత్-ఎ-ఇస్లామీ బంగ్లాదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత విడుదల చేసిన 20 టాకా నోటుకు ఇరువైపులా ఛోటో సోనా మసీదు చిత్రం ఉండేది. 2012 మార్పులో ఈ మసీదు చిత్రం నోటు వెనుక భాగానికి మారింది.

Read Also: America: యూఎస్ కు ‘విపత్తుల ఫంగస్‌’ అక్రమ రవాణా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870