చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping)ను ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Jaishankar)కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్లో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

భారత్, చైనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి జీ జిన్పింగ్కు వివరించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి జైశంకర్ (Jaishankar)చైనాకు వెళ్లారు. సోమవారం చేరుకున్న ఆయన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు హాజరయ్యారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు జరిగాయి. ఎస్సీవోలోని విదేశాంగ మంత్రులతోనూ భేటీ అయినట్లు జైశంకర్ (Jaishankar)తన ఎక్స్లో పోస్టు చేశారు. ఈ సమావేశం ద్వారా భారత–చైనా సంబంధాలపై కొత్త అనుసంధానం ఏర్పడింది. గల్వాన్ తర్వాత రెండురకాలుగా కలిసిన మొదటి అధిక స్థాయి సమావేశం ఇది LAC వద్ద జరిగిన పరిస్తితులను మెరుగుపరచవలసిన అవసరాన్ని, “విభేదాలు వివాదాలుగా మారకూడదు… పోటీ పోరాటంగా మారకూడదు” అనే తత్త్వాన్ని మద్దతు పలికారు.
జైశంకర్ ఒక ఐఏఎస్ అధికారినా?
సుబ్రహ్మణ్యం జైశంకర్ (జననం 9 జనవరి 1955), ఎస్. జైశంకర్ అని పిలుస్తారు, ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు భారత విదేశాంగ సేవ (IFS) యొక్క రిటైర్డ్ దౌత్యవేత్త, ఆయన మే 31, 2019 నుండి భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు.
డాక్టర్ ఎస్ జైశంకర్ అర్హతలు?
ఆయన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) నుండి రాజకీయ శాస్త్రంలో MA మరియు అంతర్జాతీయ సంబంధాలలో M.Phil. మరియు PhD పట్టా పొందారు, అక్కడ ఆయన అణు దౌత్యంలో ప్రత్యేకత పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Shubhanshu Shukla : భూమికి బయల్దేరిన శుభాంశు శుక్లా