📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: June 19, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌-ఇజ్రాయెల్‌(Iran-Israel) మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్‌ రియాక్టర్‌ సమీప ప్రజలకు ఐడీఎఫ్‌(IDF) హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని ఎక్స్​లో పోస్ట్ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు (155 మైళ్ళు) దూరంలో ఉంది. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్​ను చల్లపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇది అణ్వాయుధాల్లో ఉపయోగించగల ప్లూటోనిమియను ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇజ్రాయెల్ IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
అరాక్ రియాక్టర్ టెహ్రాన్‌కు 250 కి.మీ దూరంలో ఉంది. ఈ రియాక్టర్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉన్నది.

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

దాడుల్లో కనీసం 639 మంది మరణించారు
మరోవైపు ఇరాన్​పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 639 మంది మరణించగా,1,329 మంది గాయపడినట్లు వాషింగ్టన్​కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ(Human Rights Activity Organization)తెలిపింది. వారిలో 263 మంది సామాన్య ప్రజలు కాగా, 154 మంది భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్​లో 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు చెప్పింది. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 224మంది మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య 1,277గా పేర్కొంది.

శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ
మరోవైపు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రటిచింది. గురువారం టెహ్రాన్​లోని 20పైగా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. వాటిల్లో యురేనియం సెంట్రిఫ్యూజ్‌లు, అణ్వాయుధ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంపై రష్యా, చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు యూన్ భద్రతా మండలి శుక్రవారం రెండో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను తగ్గించుకుంటూ, టెహ్రాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించే పరిష్కారాన్ని చర్చించడంలో రష్యా చేయగలదని సూచించారు. మరోవైపు తమ దేశాం శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని భారత్​లోని ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ అన్నారు. కానీ ముందుగా ఇజ్రాయెల్ సైనిక చర్యను ఖండించాలని పేర్కొన్నారు. విద్యార్థులతో సహా భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా చూస్తామని అన్నారు.

Read Also: Donald Trump : నేనేం చేస్తానో తెలియదు: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

#IranIsraelConflict #MiddleEastTensions #telugu News #WarUpdates Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu israel Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today warns Iranian people

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.