Today News : Israel Gaza conflict – గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి

Read Time:  1 min
Israel Gaza conflict
Israel Gaza conflict
FONT SIZE
GET APP

Israel Gaza conflict – గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపీ లేకుండా దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే గాజా సిటీ మొత్తం పాడైపోయింది. అక్కడి ప్రజలు ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ మళ్లీ గాజ-పై (Gaza) దాడులకు పాల్పడింది. తాజాగా జరిపిన దాడుల్లో సుమారుగా 47మంది పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడులు ఇంకా పెరుగుతాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. గాజా వాసులకు మువాసీ శరణార్థి శిబిరంలో అన్ని ఏర్పాట్లు చేశామని అందరూ అక్కడికి వెళ్లాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవచే అడ్రాయీ తెలిపారు.

పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండడంతో సైన్యంలో చేరేందుకు ఆదేశ యువత ఆసక్తి చూపడం లేదు. ఇజ్రాయెల్ లో ఉన్న ప్రతి యువకుడు పదేళ్లపాటు సైన్యంలో రిజర్విస్టుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అయితే గాజా యుద్ధం (War) రాజకీయ లక్ష్యాలను సాధించడానికి జరుగుతోందని, హమాస్ను నావనం చేయడానికి కాదని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు టెల్ అవీవ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది.

Israel Gaza conflict
Israel Gaza conflict – గాజా పై ఇజ్రాయెల్ దాడులు.. 47 మంది మృతి

తిండి, వైద్యం లేక అల్లాడుతున్న ప్రజలు

గాజా, ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. నువ్వా నేనా అనేలా భీకర దాడుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకులు తమ ఇళ్లను కోల్పోయారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. తిండి, వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఈ దాడులు మాత్రం ఆగడం లేదు. యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. పాలస్తీనా ప్రజల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మానవసాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆహారం కోసం నిరీక్షిస్తున్న వారిపై కూడా గతంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఆసుపత్రులపై దాడులకు పూనుకుంది. దీంతో గాజాలో ఆహార కొరత, మందుల కొరతతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదలు తిండికి నోచుకోలేక, మరణిస్తున్నారు.

ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
గాజా సిటీ దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయింది. తాజా దాడుల్లో 47 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, మందుల కొరత, ఆసుపత్రులపై దాడులు, నిరాశ్రయుల సంఖ్య పెరగడం వల్ల పరిస్థితి మరింత విషమంగా ఉంది.

ఇజ్రాయెల్‌లో యుద్ధానికి వ్యతిరేక నిరసనలు ఎందుకు పెరుగుతున్నాయి?
గాజాపై యుద్ధం హమాస్‌ను నిలువరించడానికే కాకుండా రాజకీయ లక్ష్యాలకు నడుస్తోందని భావించి యువత సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తున్నారు. టెల్ అవీవ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సవాలుగా మారింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/gst-andhra-pradesh-sets-new-record-in-gst-collections/andhra-pradesh/540488/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.