📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: ముంబైను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ బ్యురో

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హల్గామ్‌లో ఉగ్రదాడి చోటు చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌‌లో అనూహ్య పరిణామాలు తలెత్తాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా రెడ్ అలర్ట్ జారీ అయింది. భద్రత సిబ్బంది, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటోన్నాయి. బుధవారం నాడు బారాముల్లా, కుల్గామ్‌లల్లో, నేడు ఉధంపూర్‌ జిల్లాలో భద్రత బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. యూరీ సెక్టార్ వద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు చొరబాటుదారులు హతం అయ్యారు. వారిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. పెద్ద ఎత్తున మారణాయులను స్వాధీనం చేసుకున్నారు.

దేశ ఆర్థిక రాజధానిలో మరింత నిఘా
పహల్గామ్ తరువాత అలాంటి ఉదంతం.. దేశ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యురో వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖను హెచ్చరించింది. ముంబై, శివారు ప్రాంతాలు, ఇతర తీర ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ముంబై, చుట్టుపక్కల తీరప్రాంతాలపై నిరంతరాయంగా నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ బ్యురో అప్రమత్తంగా చేసింది. సముద్రంలో నిఘా మరింత పెంచాలని, కోస్తా తీరంలో పహారా ముమ్మరం చేయాలని పేర్కొంది. కోస్టల్ గార్డులు, సెక్యూరిటీ వ్యవస్థను అప్రమత్తం చేయాలని, సముద్ర మార్గాల్లో రాకపోకలపై డేగకన్ను వేయాలని ఆదేశించింది. యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే ముంబైకి చేరిన విషయం తెలిసిందే. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

Read Also: Prakash Raj : ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి : నటుడు ప్రకాశ్ రాజ్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Intelligence Bureau Latest News in Telugu Paper Telugu News puts Mumbai on alert Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.